ముఖ్యమంత్రి తీపి కబురు: ప్రతి రైతు అకౌంట్లోకి నేరుగా 4వేలు

Published : Oct 12, 2019, 08:20 AM IST
ముఖ్యమంత్రి తీపి కబురు: ప్రతి రైతు అకౌంట్లోకి నేరుగా 4వేలు

సారాంశం

రాష్ట్రంలోని 11.5లక్షల మంది రైతుల అకౌంట్లలో 452 కోట్లను జమ చేయనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. రైతులకు పెట్టుబడి సహాయం కింద ఒక్కో రైతుకి 4వేల రూపాయలను ఇవ్వనున్నట్టు తెలిపాడు. ఈ పెట్టుబడి సహాయం నేరుగా రైతుల అకౌంటులో జమ చేయనున్నట్టు ప్రకటించారు. 

రాంచి: జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ఆ రాష్ట్ర రైతులకు ఎన్నికల వేళ ఒక తీపి కబురు చెప్పారు. రైతులకు పెట్టుబడి సహాయం కింద ఒక్కో రైతుకి 4వేల రూపాయలను ఇవ్వనున్నట్టు తెలిపాడు. ఈ పెట్టుబడి సహాయం నేరుగా రైతుల అకౌంటులో జమ చేయనున్నట్టు రఘుబర్ దాస్ ప్రకటించారు. 

లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేసారు. రాష్ట్రంలోని 11.5లక్షల మంది రైతుల అకౌంట్లలో 452 కోట్లను జమ చేయనున్నట్టు జార్ఖండ్ ముఖ్యమంత్రి తెలిపారు. 

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికే ఇలాంటి తాయిలాలు ప్రకటిస్తున్నారని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. ఈ సంవత్సరాంతం నవంబర్-డిసెంబర్ మాసాల్లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu
PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu