చ‌నిపోయిన వారికి కూడా పెళ్లిళ్లు జ‌రుగుతాయి.. ఎక్క‌డో తెలుసా?

By Mahesh RajamoniFirst Published Aug 2, 2022, 1:03 AM IST
Highlights

Pretha Kalyanam: ప్ర‌పంచంలోని కొన్ని ప్రాంతాల్లో అనుస‌రించే ఆచారాలు.. వారి సంస్కృతి మ‌న‌కు క్యూరియాసిటీ కలిగించడంతో పాటు మరికొంత విచిత్రంగానూ అనిపిస్తుంటాయి. ఇప్పుడు మీకు చెప్పబోయేది అలాంటి విషయం గురించే.. అక్కడ చనిపోయిన వారికి కూడా పెళ్లిళ్లు జరుగుతాయి..  ! 
 

Pretha Kalyanam: కొన్ని ప్రాంతాలు విభిన్న సంస్కృతులు, సాంప్ర‌దాయాల‌కు నెల‌వుగా ఉంటాయి. అలాగే, ఆ ప్రాంతాల్లోని ఆచార‌వ్య‌వ‌హారాలు కాస్తా విచిత్రంగానూ.. క్యూరియాసిటీగా ఉండేవి చాలానే ఉంటాయి. అలాంటి కోవ‌కు చెందిన‌దే.. ఇప్పుడు మీరు తెలుసుకోబోయే విష‌యం.. అక్క‌డ చ‌నిపోయిన వారికి కూడా పెళ్లిళ్లు జ‌రుగుతాయి. చ‌నిపోయిన త‌ర్వాత పెండ్లి ఎలా? అనే ప్ర‌శ్న మీకు రావ‌చ్చు.. కానీ ఇది నిజం.. మ‌రణం తర్వాత పెళ్లి అనేది వినడానికి వింతగా అనిపించవచ్చు. కానీ ఇది జ‌రిగింది. చాలా కాలం నుంచి అక్క‌డ ఇలాంటివి జ‌రుగుతున్నాయి. తాజాగా 30 ఏండ్ల  క్రితం చ‌నిపోయిన ఇద్ద‌రు పెండ్లి చేసుకున్నారు. సాధార‌ణంగా పెండ్లి అంటే ఎంత కోలాహ‌లం ఉంటుందో అలానే వీరి పెండ్లి కూడా జ‌రిగింది. ఓ వ్యక్తి దీనిని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో వైర‌ల్ గా మారింది. 

విరాల్లోకెళ్తే... శోభ, చందప్ప అనే ఇద్దరు చిన్నారులు గురువారం కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. అయితే, వారిలో ఎవరూ సజీవంగా లేరు. ఇదే అక్క‌డి విచిత్ర విశేషం. నిజానికి, ఈ వివాహ వేడుక వారి మరణించిన 30 సంవత్సరాల తర్వాత నిర్వహించారు. ఇది క‌ర్ణాట‌క‌లోని మంగ‌ళూరులో జ‌రిగింది. చ‌నిపోయిన వారి ఇరువురి కుటుంబ స‌భ్యులు క‌లిసి ఈ వివాహం జ‌రిపించారు. 

, there will be marriage procession and finally tieing the knots. If you are wondering its easy to fix this marriage, hear me out. Recently groom family rejected a bride because bride was few year elder to the groom!

Anyway I find these customs beautiful.

— AnnyArun (@anny_arun)

ఇది ఇక్క‌డి సాంప్ర‌దాయం.. అదే ప్రేత క‌ళ్యాణం..! 

ఇది 'ప్రేత కల్యాణం' లేదా 'చనిపోయిన వారి వివాహం' అనే పేరుగల దీర్ఘకాల సంప్రదాయంలో భాగంగా జరిగింది. ఇది కర్ణాటక, కేరళలోని కొన్ని ప్రాంతాలలో అనుసరించే సంప్రదాయం. ఇక్కడ పుట్టిన ప్ర‌తిఒక్క‌రికీ.. అలాగే, పెండ్లి కాకుండా మరణించిన వారికి వివాహం చేస్తారు. ఇక్కడి కమ్యూనిటీలు తమవారి ఆత్మలను గౌరవించే మార్గంగా దీనిని నమ్ముతారు.

 

Funny thing is after all the engagement nobody thought they should ask the name of bride and groom 😁 They were just asking now. 5 minutes before the muhurtam 😁 (guess still better than asking the name after one night stand eh)

Btw its Chandappa weds Shobha! pic.twitter.com/StkipGT7wX

— AnnyArun (@anny_arun)

అయితే ఇది కర్ణాటకలోని మంగళూరులో చాలా ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం. సాధారణంగా 18 ఏళ్లలోపు-అవివాహితులు,  వారు మరణించిన కొన్ని సంవత్సరాల తర్వాత ఇలాంటి మరణ కథనాలు ఉన్నవారిని వివాహం చేసుకుంటారు. కుటుంబ సభ్యులు నిలబడి ఈ పెళ్లి జరిపించారు. ఎందుకంటే వారు వివాహం చేసుకోని కారణంగా తమ ఆత్మీయుల  ఆత్మలు ఇక్క‌డే సంచరిస్తుందని ప్రజలు నమ్ముతారు. వివాహం లేకుండా ఒకరి జీవితం అసంపూర్ణంగా ఉన్నందున ఆత్మ ఎప్పుడూ మోక్షాన్ని పొందదని నమ్ముతారు. సంచారం చేసే ఆత్మ కారణంగా కుటుంబం సమస్యలను ఎదుర్కోవడం ప్రారంభించవచ్చు..  కాబట్టి చ‌నిపోయిన పెండ్లి కాకుండా చ‌నిపోతే వారికి ప్రేత క‌ళ్యాణం జ‌రిపిస్తారు. 

click me!