Amnesty India: అమ్నెస్టీ ఇండియాపై ఈడీ చ‌ర్య‌లు..  భారీ జ‌రిమానా !

Published : Jul 09, 2022, 03:59 AM IST
Amnesty India: అమ్నెస్టీ ఇండియాపై ఈడీ చ‌ర్య‌లు..  భారీ జ‌రిమానా !

సారాంశం

Amnesty India: అమ్నెస్టీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్-సీఈఓ ఆకార్‌ పటేల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చర్యలు తీసుకుంది. విదేశీ మారకద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆయ‌న‌పై ఈడీ భారీ  జరిమానా విధించింది.   

Amnesty India:  ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్, మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) ఆకార్ పటేల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చర్యలు తీసుకుంది. విదేశీ మారకద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆయ‌న‌పై ఈడీ రూ.61 కోట్లకు పైగా జరిమానా విధించింది. 

ఆమ్నెస్టీ ఇండియా, దాని మాజీ చీఫ్‌పై తీసుకున్న ఈ చర్య గురించి ED శుక్రవారం తెలియజేసింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) కింద ఆమ్నెస్టీ ఇండియాపై దర్యాప్తు సంస్థ రూ.51.72 కోట్ల జరిమానా విధించింది. అదే సమయంలో.. ఈ అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ యొక్క అప్పటి అధిపతి ఆకార్ పటేల్‌పై రూ.10 కోట్ల జరిమానా విధించబడింది. జరిమానాకు సంబంధించి ఇద్దరికీ నోటీసులు పంపినట్లు  ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. 

ఆమ్నెస్టీ ఇండియాపై  ఫిర్యాదులు రావ‌డంపై  ఈడీ విచారణ జరిపిన ఈ చర్య తీసుకుంది. ఈడీ స్పెషల్ డైరెక్టర్ స్థాయి ఫెమా అధికారి ఈ అంశంపై విచారణ చేపట్టారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తన భారతీయ విభాగం ఆమ్నెస్టీ ఇండియా ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ (AIIPL)కి పెద్ద మొత్తంలో విదేశీ విరాళాలను పంపిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (FCRA) ఉల్లంఘ‌న అని పేర్కొంది. 

ఎఫ్‌డిఐ ద్వారా డబ్బు పంపిణీ

యుకెకు చెందిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తన భారతీయ యూనిట్ల ద్వారా ఎఫ్‌డిఐ మార్గం ద్వారా పెద్ద మొత్తంలో విదేశీ విరాళాలను పంపిస్తోందన్న సమాచారం. ఆ స‌మాచారం ఆధారంగా ఫెమా కింద దర్యాప్తు ప్రారంభించినట్లు ఏజెన్సీ తెలిపింది. ఫిర్యాదు ప్రకారం.. ఆమ్నెస్టీ భారతదేశంలో తన NGO కార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేయడానికి .. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఫౌండేషన్ ట్రస్ట్ (AIIFT), ఇతర ట్రస్ట్‌లకు FCRA కింద ముందస్తుగా నమోదు చేయడానికి లేదా అనుమతిని మంజూరు చేయడానికి హోం మంత్రిత్వ శాఖ  తిరస్కరిస్తున్నప్పటికీ  విదేశీ నిధులను పంపేందుకు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ FDI మార్గాన్ని ఉపయోగించిందని ED తెలిపింది.
 
ఈ క్ర‌మంలో..నవంబర్ 2013 నుండి జూన్ 2018 వరకు విదేశాల నుండి అమ్నెస్టీ ఇండియా అందుకున్న మొత్తాన్ని వ్యాపారం, నిర్వహణ సలహాలతో సహా పబ్లిక్ రిలేషన్స్ సర్వీస్‌ల కోసం స్వీకరించిన రుసుముగా చూపబడింది. అయితే, ఇది విదేశీ కంట్రిబ్యూటర్‌ల నుండి తీసుకున్న రుణాలు తప్ప మరొకటి కాదనీ, కాబట్టి ఇది ఫెమా చ‌ట్టం ఉల్లంఘన‌గా పేర్కొంది.

FEMA అధికారి ఆమ్నెస్టీ ఇండియా నుండి వివరణాత్మక సమాధానాన్ని స్వీకరించిన తర్వాత.. AIIPL అనేది UKలోని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కింద ఏర్పడిన సంస్థ అని, దీనిని భారతదేశంలో సామాజిక కారణాల కోసం ఏర్పాటు చేసినట్లు  తేలింది.  ఆమ్నెస్టీ ఇండియా, దాని మాజీ CEO ఆకర్ పటేల్‌కు ED నుండి ఎదురుదెబ్బ తగిలింది, ఆమ్నెస్టీ ఇండియాకు రూ. 51.10 కోట్ల భారీ జరిమానా విధించింది.

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu