Nirmala Sitharaman: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి పటిష్టంగా ఉందని, 8.9%గా పురోగతి అంచనాలున్నాయనీ, ఇది అన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో అత్యధికమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
India’s economic growth: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ అర్థిక వృద్ధి 8.9 శాతంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (NDB) బోర్డ్ ఆఫ్ గవర్నర్ల 7వ వార్షిక సమావేశంలో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి పటిష్టంగా ఉందని, 8.9%గా అంచనాలున్నాయనీ, ఇది అన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో అత్యధికమని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి 8.9% వద్ద పటిష్టంగా ఉంటుందని, ఇది దేశం బలమైన స్థితిస్థాపకత మరియు వేగవంతమైన పునరుద్ధరణను ప్రతిబింబిస్తుందని అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా భారత్ అధిక వృద్ధి రేటును సాధిస్తుందని వెల్లడించారు.
"ఈ సంవత్సరం భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకలను జరుపుకుంటుందని పేర్కొంటూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి పటిష్టంగా ఉందని మరియు అన్ని పెద్ద ఆర్థిక వ్యవస్థలలో అత్యధికంగా 8.9 శాతంగా అంచనా వేయబడింది" అని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత మరియు వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతదేశం అధిక వృద్ధి రేటును సాధిస్తుందని కూడా సీతారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి కారణంగా యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడిందని వెల్లడించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. మహమ్మారి అనంతరం భారత్ బలమైన స్థితిస్థాపక.. వేగవంతమైన పునరుద్దరణను నమోదుచేసిందని తెలిపారు. వినూత్న ఆర్థిక ఉత్పత్తులు మరియు సేవల అభివృద్ధి మరియు వ్యూహాత్మక పెట్టుబడులను ప్రోత్సహించడంపై దృష్టి సారించిన విషయాన్ని ఉద్ఘాటించారు. దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి ప్రభావాన్ని పెంచడానికి ఇవి చాలా కీలకమైనవిగా ఉన్నాయని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
భారతదేశంలో ఎన్డీబీ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంలో సాధించిన పురోగతిని ఆర్థిక మంత్రి గుర్తిస్తూ.. రాబోయే దశాబ్దాలలో బ్యాంక్ సభ్య దేశాల అభివృద్ధి ప్రయాణంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. బ్రిక్స్ దేశాలు మరియు ఇతర అభివృద్ధి చెందుతున్న మరియు మార్కెట్ ఆర్థిక వ్యవస్థలలో స్థిరమైన మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి వనరులను సమీకరించే లక్ష్యంతో NDB 2015లో స్థాపించబడిన విషయాన్ని గుర్తుచేశారు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ఆర్థిక వ్యవస్థలకు NDB విశ్వసనీయమైన అభివృద్ధి భాగస్వామిగా విజయవంతంగా స్థిరపడిందని పేర్కొన్నారు. వర్చువల్ గా జరిగిన ఈ సమావేశానికి రష్యా, దక్షిణాఫ్రికా గవర్నర్లు సహా కొత్తగా చేరిన బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రతినిధులు కూడా హాజరయ్యారు. జూలై 2014లో బ్రిక్స్ దేశాల సమూహం (బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా) ద్వారా స్థాపించబడిన NDB ఒక సంవత్సరం తర్వాత USD 50 బిలియన్ల ప్రారంభ చందా మూలధనంతో మొత్తం USD 10 బిలియన్ల చెల్లింపు మూలధనంతో కార్యకలాపాలను ప్రారంభించింది.
ఇదిలావుండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాను ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తగ్గించడం గమనార్హం. 2022-23 ఏడాదిలో వృద్ధి రేటు 7.8 శాతం నమోదయ్యే అవకాశం ఉందని ముందుగా అంచనా వేసిన ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ .. ఇప్పుడు 7.3 శాతానికి తగ్గించింది. అధిక ద్రవ్యోల్బణం, ఉక్రెయిన్-రష్యా యుద్ధ పరిణామాలు కారణంగా పేర్కొంది.