
Election Commission: రాజకీయాలను రచ్చ చేస్తున్న రాజకీయ నాయకులకు ఎన్నికల సంఘం పెద్ద చిక్కు తెచ్చిపెడుతోంది. రెండు దశాబ్దాల నాటి చట్టాన్ని పరిగణనలోకి తీసుకుని, ఒక్క వ్యక్తి ఒకటి కంటే.. ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడాన్ని సవరించాలని ఈసీ ప్రభుత్వాన్ని కోరింది. ఇంకా, ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయకూడదని, ఆ పద్ధతిని నిలిపివేయాలని ఈసీ కోరింది. ఈ పద్దతిని ఆపడానికి భారీ జరిమానా విధించే నిబంధనను రూపొందించాలని కోరినట్లు కమిషన్ తెలిపింది.
ఈ నేపథ్యంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఇటీవల కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ లెజిస్లేటివ్ సెక్రెటరీతో మాట్లాడారు. పలు చోట్ల అలాంటి సంప్రదాయానికి స్వస్తి చెప్పవచ్చునని ఈసీ భావిస్తోంది. ఎందుకంటే ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థి రెండు సీట్లు గెలిస్తే.. ఒక సీటు ఖాళీ చేయాల్సి ఉంటుంది, అలాంటప్పుడు 6 నెలల్లోపు ఆ సీటుకు ఉపఎన్నికలు నిర్వహించాలి, దాని వల్ల ఎన్నికల కమీషన్ నష్టపోవాల్సి వస్తుంది. ఇది EC ఇబ్బందిగా కూడా మారుతుంది.
మీడియా కథనాల ప్రకారం.. 1996లోని ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించడం ద్వారా.. ఏ అభ్యర్థి అయినా ఎన్నికలలో రెండు కంటే ఎక్కువ స్థానాల నుండి పోటీ చేసేలా ఏర్పాటు చేయబడింది. ఈ సవరణకు ముందు ఎన్నికల్లో పోటీ చేసే సీట్ల సంఖ్యపై పరిమితి లేదు. ప్రస్తుత విధానం కొనసాగితే ఉపఎన్నికకు అయ్యే ఖర్చు మొత్తాన్ని సీటుపై ఉపఎన్నికకు దారితీసిన వ్యక్తి నుంచి వసూలు చేయాలని ఈసీ కేంద్రానికి తెలిపినట్టు వార్తలు వస్తున్నాయి.
అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో రూ.5 లక్షలు, లోక్ సభకు జరిగిన ఉప ఎన్నికల్లో రూ.10 లక్షలు జరిమానా విధించే అంశం కూడా ప్రస్తావించినట్టు, ఈ ప్రతిపాదన కూడా ఈసీ తెరపైకి వచ్చింది. సమాచారం ప్రకారం.. ఈ ప్రతిపాదన మొదట 2004 లో వచ్చింది. కానీ ECకి సంబంధించిన విషయాలలో, శాసన శాఖ ప్రభుత్వ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఇప్పటి వరకు, ఏ ప్రజా ప్రతినిధి అయినా ఒక స్థానానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించగలడు. ఒక అభ్యర్థి రెండు స్థానాల్లో పోటీ చేసి రెండింటిలో విజయం సాధిస్తే, ఆ ప్రజా ప్రతినిధికి ఒక స్థానానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించే హక్కు ఉంటుంది.