Maharashtra Earthquake : మహారాష్ట్రలోని హింగోలిలో భూకంపం.. తెలంగాణ, కర్ణాటకలోనూ ప్రకంపనలు..

Published : Nov 20, 2023, 01:16 PM IST
Maharashtra Earthquake : మహారాష్ట్రలోని హింగోలిలో భూకంపం.. తెలంగాణ, కర్ణాటకలోనూ ప్రకంపనలు..

సారాంశం

Maharashtra Earthquake : మహారాష్ట్రలోని హింగోలిలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 3.5గా నమోదైంది. ఈ భూకంపం వల్ల తెలంగాణ, కర్ణాటకలోనూ ప్రకంపనలు వచ్చాయి. 

Maharashtra Earthquake : మహారాష్ట్రలో భూకంపం సంభవించింది. హింగోలి జిల్లాలోని సోమవారం తెల్లవారుజామున 05.09 గంటలకు ఒక్క సారిగా భూప్రకంపనలు వచ్చాయి. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) వెల్లడించింది. భూకంప కేంద్రం భూ ఉపరితలం నుండి 5 కిలోమీటర్ల దిగువన ఉంది. అయితే భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

Uttarkashi tunnel collapse : ఇంకా సొరంగంలోనే రాని కార్మికులు.. ఘటనా స్థలానికి చేరుకున్న అంతర్జాతీయ నిపుణులు

ఒక్క సారిగా వచ్చిన ఈ ప్రకంపన వల్ల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. హింగోలి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రజలు తమ ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడారు. దీంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ భూకంప సంభవించిన విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ఓ పోస్టు పెట్టింది.

కాగా.. మహారాష్ట్రలో సంభవించిన ఈ భూకంప ప్రభావం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ కనిపించింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ భూ ప్రకంపనలు వచ్చాయి. ఆదివారం, నేపాల్, జమ్మూ కాశ్మీర్‌లోని దోడాలో ప్రాంతాల్లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాంతాల్లో కూడా ఎలాంటి ప్రాణ నష్టమూ సంభవించలేదు. 

విషాదం.. నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సూసైడ్.. ఏం జరిగిందంటే ?

ఇదిలా ఉండగా.. ఆదివారం తెల్లవారుజామున అండమాన్ నికోబార్ దీవుల్లోని అండమాన్ సముద్రంలో ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. దీని వల్ల కూడా ఎలాంటి నష్టమూ సంభవించినట్టు సమాచారం లేదు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?