ఆధ్యాత్మిక నగరం మధురై పీపీకులం ఇండియన్ బ్యాంక్, ఐటీ కార్యాలయం పరిసరాల్లోకి హఠాత్తుగా మద్యాహ్నం 3 గంటల సమయంలో వచ్చిన ఓ శునకం కలకలం సృష్టించింది.
చెన్నై : తమిళనాడులో ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం కనిపించింది. ఓ శుకనం పసికందు తలను నోట కరుచుకుని.. మధురై పీపీకులం పరిసరాల్లో చక్కర్లు కొట్టింది. ఓ యువకుడు అతి కష్టం మీద శునకం నుంచి బిడ్డ తలను లాగేసుకున్ని పోలీసులకు అప్పగించాడు.
ఆధ్యాత్మిక నగరం మధురై పీపీకులం ఇండియన్ బ్యాంక్, ఐటీ కార్యాలయం పరిసరాల్లోకి హఠాత్తుగా మద్యాహ్నం 3 గంటల సమయంలో వచ్చిన ఓ శునకం కలకలం సృష్టించింది. ఆ శునకం నోట్లో మరణించిన పసికందు తల ఉండడంతో చూసిన వారందరి హృదయాలు బరువెక్కాయి. దాడి చేస్తుందనే భయంలో ఆ శునకం దగ్గరకు వెళ్లలేదు.
ఈ సమయంలో సెల్లూరుకు చెందిన అయ్యనార్ పరుగులు తీస్తూ... పసికందు తలను కుక్క విడిచిపెట్టే విధంగా చేశాడు. పోలీసులు బిడ్డ తలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా శిశువు పుట్టి నాలుగు రోజులై ఉండవచ్చని వైద్యులు తేల్చారు.