‘చెప్పేది వినడు.. సభలో కూర్చోడు..’ రాహుల్ గాంధీ మీద మోడీ సెటైర్లు...

Published : Feb 10, 2022, 09:02 AM ISTUpdated : Feb 10, 2022, 09:03 AM IST
‘చెప్పేది వినడు.. సభలో కూర్చోడు..’ రాహుల్ గాంధీ మీద మోడీ సెటైర్లు...

సారాంశం

రాహుల్ గాంధీ మీద ప్రధానిమోదీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో కాంగ్రెస్ విరుచుకుపడింది. దీనిమీద ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ వివరణ ఇచ్చారు. రాహుల్ సభలో చెప్పది వినడు.. కూర్చోడు.. అతనిని నేనేం మాట్లాడానో ఎలా తెలుస్తుంది.. అంటూ సైటైర్లు వేశారు.   

న్యూఢిల్లీ : India-China border dispute, నిరుద్యోగం పెరగడం వంటి అంశాలపై పార్లమెంట్‌లో స్పష్టత ఇవ్వనందుకు కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అధినేత Rahul Gandhi చేసిన దాడికి, సంబంధిత మంత్రిత్వ శాఖలు వివరణాత్మక సమాధానాలు ఇచ్చాయని ప్రధాని Narendra Modi బుధవారం అన్నారు. ఎప్పుడైనా, ఎక్కడైనా అవసరమైనప్పుడు కొన్ని విషయాలపై మాట్లాడానని చెప్పుకొచ్చారు. 

వార్తా సంస్థ ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ప్రధాని కాంగ్రెస్ మాజీ చీఫ్‌ను లక్ష్యంగా చేసుకుని, "మాట వినడు.. సభలో కూర్చోడు.." అంటూ చెప్పుకొచ్చారు. పార్లమెంట్‌లో చర్చను స్వాగతిస్తున్నట్లు నొక్కిచెప్పిన ప్రధాని మోదీ, తాను, తన ప్రభుత్వం ఎవరిపైనా దాడి చేయడం లేదని, చర్చలను నమ్ముతామని అన్నారు. ఆయన మాట్లాడుతూ... " దాడి చేసే భాష నాకు తెలియదు. అది నా స్వభావంలో కూడా లేదు. కానీ తర్కం వాస్తవాల ఆధారంగా, మీడియా నా మాటల మీద కొంత వివాదాన్ని రేకెత్తిస్తుంది" అని ఆయన అన్నారు.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోక్‌సభ, రాజ్యసభల్లో తన ప్రసంగాల సందర్భంగా నిరుద్యోగం, భారత్-చైనా సమస్యలపై రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారని కాంగ్రెస్ ఆరోపణలపై..మీడియా అడిగిన ప్రశ్నకు ప్రధాని సమాధానమిచ్చారు. 

దీనిమీద మాట్లాడుతూ ప్రధాన మంత్రి, "మేము ఎవరిపై దాడి చేయం, సమస్యను కూర్చుని మాట్లాడుకోవడానికి మేము ఇష్టపడతాం. కొన్నిసార్లు పార్లమెంటులో చర్చలు, అంతరాయాలు జరుగుతాయి. నేను దీనిని స్వాగతిస్తున్నాను. అంతేకానీ... నేను విసుగు చెందడానికి ఎటువంటి కారణం లేదు."

"నేను ప్రతి అంశంపై వాస్తవాలు మాట్లాడాను. ప్రతి అంశంపై వాస్తవాల ఆధారంగా మాట్లాడాను. కొన్ని విషయాలపై, మా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ వివరణాత్మక సమాధానాలు ఇచ్చాయి. అవసరమైన చోట, నేను కూడా మాట్లాడాను. అసలు నేనేం మాట్లాడానో.. వినని.. సభలో కూర్చోని వ్యక్తికి నేను ఎలా ప్రత్యుత్తరం ఇవ్వగలను?" అని చెప్పుకొచ్చారు.

అంతకుముందు, రాహుల్ గాంధీ పార్లమెంటులో తన ప్రసంగాల సందర్భంగా కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన తీవ్ర దాడికి ప్రతిస్పందించారు. బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం "కాంగ్రెస్‌కు భయపడుతోంది" అని అన్నారు.

ప్రధానికి కాంగ్రెస్ అంటే ఉన్న భయానికి పార్లమెంట్‌లో ఆయన ప్రసంగం అద్దం పడుతోందని, ఆ పార్టీని విమర్శించడంపైనే ఆయన దృష్టి సారించారు.. తప్ప బీజేపీ చేసిన వాగ్దానాల గురించి మాట్లాడడం లేదని ఆరోపించారు. ఫిబ్రవరి 2న లోక్‌సభలో ప్రతిపక్షాల తరపున చర్చను ప్రారంభించిన రాహుల్ గాంధీ.. ఈ చర్చలో భాగంగా... నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, భారత్-చైనా సరిహద్దు సమస్యపై కేంద్ర ప్రభుత్వం,  ప్రధాని మోదీలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ఫిబ్రవరి 7న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోక్‌సభలో జరిగిన చర్చకు సమాధానమిస్తూ, కాంగ్రెస్ విధానం ‘విభజించి పాలించు’ అని, కాంగ్రెస్ ‘తుక్డే తుక్డే’ ముఠాకు నాయకుడని ప్రధాని మోదీ అన్నారు.ఆ తరువాతి రోజు ఫిబ్రవరి 8న రాజ్యసభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ ఆలోచనలను 'అర్బన్ నక్సల్స్' హైజాక్ చేశారని అన్నారు. కాంగ్రెస్ లేకుంటే ఎమర్జెన్సీ ఉండేదని, కుల రాజకీయాలు ఉండవని, సిక్కుల ఊచకోత ఎప్పటికీ ఉండేది కాదని, కాశ్మీరీ పండిట్‌లపై దాడులు జరిగేది కాదని అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Artemis II Success..త్వరలో మరోసారి చంద్రుడి చెంతకు | Moon Mission | Nasa | Asianet News Telugu
చందమామ ఎలా ఉన్నాడో చూశారా? 🚀 NASA Artemis II | స్పేస్ టు స్పేస్ కాల్! | Viral | Asianet News Telugu