Amit Shah on Census :జనాభా గణన డిజిటలైజేషన్.. జనన, మరణ రిజిస్టర్‌తో లింక్ : అమిత్ షా

Published : May 10, 2022, 05:27 AM IST
Amit Shah on Census :జనాభా గణన డిజిటలైజేషన్.. జనన, మరణ రిజిస్టర్‌తో లింక్ : అమిత్ షా

సారాంశం

Amit Shah on Census : తదుపరి జనాభా గణన ఈ-సెన్సస్ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా  అన్నారు. ఇది రాబోయే 25 సంవత్సరాల అభివృద్ధి విధానాలను రూపొందిస్తుంది. 2024 నాటికి దేశంలోని జనన మరణాలన్నింటినీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేసే జనాభా లెక్కలతో అనుసంధానం చేస్తామని చెప్పారు. కరోనా మహమ్మారి కారణంగా జనాభా గణన ప్రక్రియ ఆలస్యమైంది.  

Amit Shah on Census : జ‌న‌భా గణన ప్రక్రియను డిజిటలైజేషన్ చేశామ‌ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. త‌దుప‌రి జ‌నాభా గ‌ణ‌న ఈ-సెన్సస్ అని, త్వ‌ర‌లోనే ఈ ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌వుతుంద‌ని తెలిపారు. కరోనా నేపథ్యంలో ఆలస్యమైన ఈ ప్రక్రియను రానున్న జన గణనలో అమలు చేస్తామన్నారు. అలాగే జనన, మరణాల నమోదును జనాభా లెక్కలతో అనుసంధానం చేస్తామని చెప్పారు.

దీంతో ఇకపై దేశంలో పుట్టే వారు ఆటోమేటిక్‌గా జనాభా లెక్కల్లో చేరుతారని, మరణింగానే ఆ జాబితా నుంచి తొలగిపోతారని వెల్లడించారు. దీని కోసం జనాభా గణన ప్రక్రియను మరింత శాస్త్రీయంగా నిర్వహించేందుకు ఆధునిక పద్ధతులను పాటించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించిందని వివరించారు.

 అమిన్‌గావ్‌లో జనాభా గణన కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ 100 శాతం ఖచ్చితమైన గణన జరిగేలా జనాభా గణన ప్రక్రియను డిజిటలైజేషన్‌ చేశామన్నారు. అనేక అంశాల కారణంగా జనాభా గణన అవసరం. జనాభా పట్ల సున్నితంగా ఉండే అస్సాం వంటి రాష్ట్రాలకు ఇది మరింత ముఖ్యమైంద‌ని అన్నారు.

పేరు/చిరునామా మార్చడం సులభం 

2024 నాటికి జనన, మరణ రిజిస్టర్లను జనాభా లెక్కలతో అనుసంధానం చేస్తామని చెప్పారు. ప్రతి జననం మరియు మరణం నమోదు చేయబడుతుంది, అంటే మన జనాభా గణన ఆటోమిటిక్ గా అప్ డేట్ అవుతుంది.  పుట్టిన తర్వాత వివరాలను సెన్సస్ రిజిస్టర్‌లో చేరుతాయి.18 ఏళ్లు నిండిన తర్వాత ఓటరు జాబితాలో పేరును న‌మోదు అవుతోంది. చనిపోయిన తర్వాత పేరును తొలగిస్తారు. పేరు/చిరునామా మార్పు సులభం అవుతుంది.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జనాభా గణనను మరింత కచ్చితత్వంతో, శాస్త్రీయంగా, బహుమితీయంగా నిర్వహించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర హోంమంత్రి తెలిపారు.   జనాభా లెక్కల ప్రకారం రూపొందించిన అభివృద్ధి మ్యాప్ ఆధారంగా బడ్జెట్ ప్రణాళిక ఉంటే, సమస్యలు ఆటోమేటిక్‌గా పరిష్కారమవుతాయని తెలిపారు. 
 
జనాభా గణనను కొత్త కోణంలో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇ-సెన్సస్‌కు కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, దాని ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. దాదాపు 50 శాతం మంది తమ డేటాను సొంతంగా నింపుకోగలుగుతారు. తన కుటుంబ సభ్యుల డేటాను కూడా అతనే ఈ-ఫారం రూపంలో పూరిస్తాడు.

సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిపై కేంద్రం దృష్టి

అంతకుముందు, మంకచార్ సెక్టార్‌లోని భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో భద్రతా పరిస్థితిని షా సమీక్షించారు. దేశ సరిహద్దు భద్రతను పటిష్టం చేసేందుకు జవాన్లకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేస్తామని చెప్పారు. సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) అధికారులతో కూడా పరిస్థితిని చర్చించారు.  
 
సరిహద్దు ప్రాంతాల్లో అభివృద్ధి కరువైందని, దీంతో ప్రజలు వలసలు పోతున్నారని కేంద్ర హోంమంత్రి అన్నారు. సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్ (BTR) సమగ్ర అభివృద్ధికి ప్రధాన మంత్రి కట్టుబడి ఉన్నారు. ఇందుకోసం త్వరలో రూ.500 కోట్ల కొత్త ప్యాకేజీని విడుదల చేయనున్నారు.
  
తాముల్‌పూర్‌లో BSF యొక్క సెంట్రల్ వర్క్‌షాప్ మరియు స్టోర్‌కు శంకుస్థాపన చేయడంతో పాటు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల (CAPFలు) 107 క్యాంటీన్లలో ఖాదీ ఉత్పత్తుల విక్రయాలను కేంద్ర హోం మంత్రి షా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో దేశవ్యాప్తంగా అన్ని సీఏపీఎఫ్ క్యాంటీన్లలో ఖాదీ ఉత్పత్తుల విక్రయాలు ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని ఏడేళ్ల క్రితం బీజేపీ హామీ ఇచ్చిందని షా అన్నారు. అప్పటి నుండి 9,000 మంది మిలిటెంట్లు తమ ఆయుధాలను విడిచిపెట్టారు.

PREV
click me!

Recommended Stories

Traffic Rules: వాహ‌నాల‌పై కులం పేర్లు రాసుకుంటే రూ. 2 వేలు ఫైన్‌.. ర‌వాణా శాఖ కీల‌క నిర్ణ‌యం
TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu