ఢిల్లీ సర్వీసెస్ బిల్లు : ఆప్ కోసమే కాంగ్రెస్ ఎత్తుగడ - అమిత్ షా

Published : Aug 08, 2023, 01:54 PM IST
ఢిల్లీ సర్వీసెస్ బిల్లు : ఆప్ కోసమే కాంగ్రెస్ ఎత్తుగడ - అమిత్ షా

సారాంశం

ఆమ్ ఆద్మీ పార్టీని మచ్చిక చేసుకోవాలనే ఎత్తుగడతోనే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో ఢిల్లీ సర్వీసెస్ బిల్లును వ్యతిరేకించిందని కేంద్ర మంత్రి అమిత్ షా ఆరోపించారు. త్వరలోనే ఆప్ ఇండియా కూటమి నుంచి వైదొలుగుతుందని అన్నారు.

రాజ్యసభలో సోమవారం నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు, 2023పై చర్చ సందర్భంగా కాంగ్రెస్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. ఆ పార్టీకి ప్రజాస్వామ్యంపై మాట్లాడే హక్కు లేదని షా అన్నారు. 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీపై కాంగ్రెస్‌ను ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి మాట్లాడుతూ.. ‘‘మేము ఎమర్జెన్సీని తీసుకురావడానికి రాజ్యాంగానికి సవరణలు చేయడం లేదు. ప్రజాస్వామ్యంపై మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదు’’ అని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీని ప్రసన్నం చేసుకునేందుకే కాంగ్రెస్..ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) మద్దతు ఇస్తోందని ఆయన అన్నారు.

మద్యం పాలసీ కుంభకోణం దర్యాప్తులో జోక్యం చేసుకునేందుకు విజిలెన్స్ విభాగానికి ఆప్ అధికారులను బదిలీ చేసిందని అమిత్ షా ఆరోపించారు. ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన ఫైళ్లు అక్కడ ఉన్నందునే విజిలెన్స్ డిపార్ట్ మెంట్ లోని అధికారులను ఆప్ ప్రభుత్వం బదిలీ చేసిందని అన్నారు. ఢిల్లీ సేవల బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఆప్ విపక్షాల ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా) నుంచి వైదొలుగుతుందని కేంద్ర మంత్రి తెలిపారు.

ఇదిలా ఉండగా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు, 2023ని ఎగువ సభలో పరిశీలన కోసం ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ఆగస్టు 3న లోక్‌సభ ఆమోదించింది. ఆప్ ప్రభుత్వం నుండి దేశ రాజధానిలో సీనియర్ అధికారుల బదిలీలు మరియు పోస్టింగ్‌లపై నియంత్రణను తీసివేసే ఆర్డినెన్స్‌ను భర్తీ చేయడం ఈ బిల్లు లక్ష్యం.

అయితే అనేక విషయాల్లో ఆప్ తో వ్యతిరేకంగా ఉండే కాంగ్రెస్ ఈ విషయంలో మాత్రం మద్దతు తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలో చేరిన నేపథ్యంలో రాజ్యసభలో, లోక్ సభలో ఈ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఢిల్లీలో పోలీసు, పబ్లిక్ ఆర్డర్, భూమి మినహా సేవల నియంత్రణను అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అప్పగించిన తర్వాత మే 19 రోజుల తర్వాత కేంద్రం ఈ ఆర్డినెన్స్‌ను విడుదల చేసింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండియాలో ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది..? రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా?
Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu