
కొంత మంది రీల్స్ చేయడానికి వెనుక ముందు ఏం ఆలోచించడం లేదు. వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరి రీల్స్ చేస్తున్నారు. తాజాగా ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ముగ్గురు వ్యక్తులు అమీర్ ఖాన్ స్టార్గా తెరకెక్కిన బ్లాక్బస్టర్ హిట్ మూవీ త్రీ ఇడియట్స్ లోని బైక్ పై ఆస్పత్రికి వెళ్లే సీన్ను రీక్రియేట్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో తెగ వైరల్ గా మారింది. ఈ విషయంపై ఢిల్లీ పోలీసులు తమదైన శైలిలో వివరణ ఇచ్చారు. రానున్న రోజుల్లో బైక్, కార్లపై విన్యాసాలు చేసే వీడియోలు సోషల్ మీడియాలో తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి వారికి గుణపాఠం చెప్పేందుకు పోలీసులు కఠిన వైఖరి అవలంభిస్తున్నారు. తాజాగా ఢిల్లీలో కేసు నమోదైంది.
ఇంతకీ ఆ వీడియోలో ఏముంది.?
ఈ వైరల్ క్లిప్లో ఒక వ్యక్తి బుల్లెట్ బైక్ను నడుపుతున్నట్లు చూడవచ్చు. '3 ఇడియట్స్' సినిమా పాట 'జానే నహీ దేంగే తుజే...' బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతోంది. అతివేగంగా వెళ్తున్న ఆ బైక్ పై ఓ యువకుడితో పాటు ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ముగ్గురు వ్యక్తులు కలిసి అమీర్ ఖాన్ యొక్క సూపర్ హిట్ చిత్రం సన్నివేశాన్ని రీక్రియేట్ చేశారు. అయితే, ఈ విషయం వైరల్ కావడంతో, ఢిల్లీ పోలీసులు విషయాన్ని గ్రహించి వారికి ఛాలెంజ్ చేశారు. బైక్ నడుపుతున్నప్పుడు ఎవరూ హెల్మెట్ ధరించకపోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ వీడియోను 'ఢిల్లీ పోలీస్' (@DelhiPolice) అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా జూలై 24న పోస్ట్ చేశారు.- మీరు రీల్స్ కోసం ప్రమాదకరంగా డ్రైవ్ చేస్తే అంతా బాగాలేదు (అంతా బాగా లేదు). దానితో పాటు చలాన్ చేయకుండా వెళ్లనివ్వబోమని కూడా రాశారు. ఇప్పటివరకు వరకు 31 వేలకు పైగా వ్యూస్, 250కి పైగా లైక్లు వచ్చాయి. వినియోగదారులందరూ కూడా వ్యాఖ్యానించారు. కొంతమంది వినియోగదారులు ప్రజలకు అవగాహన కల్పించడానికి 'ఢిల్లీ పోలీస్' ఈ విధానంగా వీడియో రూపొందించారని కామెంట్స్ చేశారు.