మరోసారి ఉలిక్కిపడ్డ ఢిల్లీ..  మహిళ దారుణ హత్య.. కవర్లలో శరీర భాగాలు.. 

Published : Jul 13, 2023, 06:32 AM IST
మరోసారి ఉలిక్కిపడ్డ ఢిల్లీ..  మహిళ దారుణ హత్య.. కవర్లలో శరీర భాగాలు.. 

సారాంశం

ఢిల్లీలోని గీతా కాలనీలోని ఫ్లై ఓవర్ దగ్గర ఛిద్రమైన మృతదేహం లభ్యమైంది. మృతదేహం   కొన్ని ముక్కలు లభించడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.

దేశరాజధాని ఢిల్లీ మరోసారి ఉలిక్కిపడింది. గీతా కాలనీలోని ఫ్లైఓవర్ సమీపంలో ఓ మహిళ మృతదేహం ముక్కలుగా పడి ఉంది. బుధవారం ఉదయం వచ్చిన సమాచారం ప్రముఖ శ్రద్దా హత్య కేసును మళ్లీ గుర్తుకు తెచ్చింది. మృతదేహంలోని పలు ముక్కలు లభించడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫ్లైఓవర్ సమీపంలో కొన్ని మానవ శరీర భాగాలు పడి ఉన్నాయని ఉదయం 9.15 గంటలకు తమకు సమాచారం అందింది. అవయవాలు చాలా చోట్ల చెల్లాచెదురుగా పడ్డాయి. మహిళను ఇంకా గుర్తించలేదు. 

ఈ విషయాన్ని ధృవీకరిస్తూ జమున ఖాదర్ ప్రాంతంలో రెండు ముక్కలుగా నరికిన మృతదేహం లభ్యమైందని డీసీపీ నార్త్ సాగర్ సింగ్ కల్సి తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎఫ్‌ఎస్‌ఎల్‌, క్రైమ్‌ టీమ్‌ దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక దశలో మృతురాలి వయస్సు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని తెలుస్తోంది. కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదైంది. పరిసర ప్రాంతాల్లోనూ విచారణ చేస్తున్నారు. గీతా కాలనీ ఫ్లైఓవర్ కింద మృతదేహం లభ్యమైంది. శరీర భాగాలు 2 సంచులలో కనిపించాయి. ఒకదానిలో తల, మరొక దానిలో ఇతర శరీర భాగాలు ఉన్నాయి. పొడవాటి జుట్టును బట్టి మృతదేహం మహిళది అని తెలుస్తోంది. శరీరం కుళ్లిపోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలిస్తున్నారు. ఫోరెన్సిక్ విచారణ జరుగుతోందని సెంట్రల్ రేంజ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పరమాదిత్య తెలిపారు.
 

గత వారం 

వారం రోజుల క్రితం కూడా అలాంటి కేసు మరొకటి వెలుగులోకి వచ్చింది. గత వారం పోలీసులు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి వెనుక అడవుల్లో కుళ్ళిపోయిన మృతదేహాన్ని కనుగొన్నారు. పోలీసులు మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టంకు తరలించారు. మృతదేహం మహిళదేనా లేక పురుషుడిదా అనేది ఇంకా తెలియరాలేదు. 174 సీఆర్‌పీసీ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతదేహంపై ఉప్పు పోసి ఉందని, దీని కారణంగా గుర్తించలేకపోయామని చెప్పారు.

శ్రద్ధా హత్య కేసు

గతేడాది 27 ఏళ్ల శ్రద్ధను ఆమె ప్రియుడు అఫ్తాబ్ పూనావల్లా గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని 30కి పైగా ముక్కలు చేసి వివిధ ప్రాంతాల్లో పడేశారు. అఫ్తాబ్ శ్రద్ధా మృతదేహాన్ని ముక్కలుగా నరికి 18 రోజులపాటు నిర్మానుష్య ప్రాంతాల్లో పడవేస్తూ వచ్చాడు. కొన్ని అవయవాలను ఫ్రిజ్‌లో ఉంచాడు. దాదాపు ఆరు నెలల తర్వాత శ్రద్ధ తండ్రి తన మిస్సింగ్ రిపోర్ట్ ఇవ్వడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. అఫ్తాబ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అతని విచారణ కొనసాగుతోంది.

PREV
click me!

Recommended Stories

Indian Army Romeo Force Destroys: గడ్డ కట్టే మంచులో మన ఇండియన్ ఆర్మీ| Asianet News Telugu
Tourists Enjoy New Year’s First Snow in Chamba: మంచు కొండల్లో న్యూఇయర్ వేడుకలు | Asianet News Telugu