ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుల రిమాండ్‌ పొడిగింపు.. త్వరలో మరో చార్జ్‌షీట్ దాఖలు చేయనున్న ఈడీ..!

Published : Jan 02, 2023, 03:48 PM IST
ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుల రిమాండ్‌ పొడిగింపు.. త్వరలో మరో చార్జ్‌షీట్ దాఖలు చేయనున్న ఈడీ..!

సారాంశం

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితులుగా ఉన్న శరత్ చంద్రారెడ్డి, బినోయ్‌బాబు,విజయ్ నాయర్,అభిషేక్ బోయినపల్లిలకు జ్యుడీషియల్ రిమాండ్ గడువును న్యాయస్థానం ఈ నెల 7 వరకు పొడిగించింది. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుల రిమాండ్‌ను న్యాయస్థానం పొడిగించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న శరత్ చంద్రారెడ్డి, బినోయ్‌బాబు,విజయ్ నాయర్,అభిషేక్ బోయినపల్లిలకు గతంలో కోర్టు విధించిన రిమాండ్ నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిందితులను కోర్టు ముందు హాజరుపరిచారు. నిందితుల కస్టడీని పెంచాలని కోరుతూ సీబీఐ  కోర్టులో ఈడీ పిటిషన్ వేసింది. దీంతో నిందితుల జ్యుడీషియల్ రిమాండ్ గడువును న్యాయస్థానం ఈ నెల 7 వరకు పొడిగించింది. 

ఇక, ఈ కేసులో ఇప్పటికే ఇండోస్పిరిట్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మహేంద్రు‌ పాత్రపై ఈడీ అధికారులు చార్జ్‌షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి మరో చార్జ్‌షీట్‌ను జనవరి 5వ తేదీన ఈడీ దాఖలు చేసే అవకాశం ఉంది. సమీర్ మహేంద్రుపై దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ఈడీ అధికారులు.. తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ రెడ్డి‌లతో పాటు తదితరుల పేర్లను ప్రస్తావించిన సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Ayodhya Ram Mandir : అయోధ్యలో ఆలయాన్నయితే కట్టేశాం, కానీ అసలు పని ఇప్పుడే మొదలైంది: ప్రాజెక్ట్ చీఫ్ నృపేంద్ర మిశ్రా
జూలై 1 నుంచి రైల్వే కొత్త రూల్స్... | Indian Railways New Rules from July 1 | Asianet News Telugu