కేజ్రీవాల్ కి ఢిల్లీ కోర్టు సమన్లు

Published : Sep 18, 2018, 12:29 PM ISTUpdated : Sep 19, 2018, 09:29 AM IST
కేజ్రీవాల్ కి ఢిల్లీ కోర్టు సమన్లు

సారాంశం

చీఫ్ సెక్రటరీ అన్షు ప్రకాశ్ పై కేజ్రీవాల్ తన సొంత నివాసంలో దాడి చేశారనే ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టుకు రావాల్సిందిగా సమన్లు జారీ చేశారు.  

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి  ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. చీఫ్ సెక్రటరీ అన్షు ప్రకాశ్ పై కేజ్రీవాల్ తన సొంత నివాసంలో దాడి చేశారనే ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టుకు రావాల్సిందిగా సమన్లు జారీ చేశారు.

పాటియాలా హౌజ్ కోర్టు సీఎం కేజ్రీతో పాటు మరో 11 మంది ఎమ్మెల్యేలకు ఈ ఆదేశాలు జారీ చేసింది. చీఫ్ సెక్రటరీని కొట్టిన కేసులో తాజాగా ఢిల్లీ పోలీసులు చార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించారు. కేజ్రీతో పాటు 11 మంది మంత్రులు ఆ దాడికి కారణమంటూ ఆ చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. అక్టోబర్ 25వ తేదీన కేజ్రీవాల్ కోర్టుకు రావాలంటూ ఆదేశించారు.

సీఎస్‌పై దాడి జరిగిన కేసులో మే 18వ తేదీన సీఎం కేజ్రీవాల్‌ను పోలీసులు మూడు గంటల పాటు విచారించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఓ సమావేశానికి కేజ్రీ ఇంటికి వెళ్లిన సీఎస్‌పై దాడి జరిగింది. సీఎం సమక్షంలోనే దాడి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే కేసులో మొత్తం 11 మంది ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు.

PREV
click me!

Recommended Stories

సీఎం విజయ్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా| CM Joseph Vijay Travels in Chennai Metro with Common People
చెన్నై మెట్రో పనులు పరిశీలించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Reviews Chennai Metro Rail Works