కోవిడ్-19 : దేశవ్యాప్తంగా మరోసారి తగ్గిన కేసులు.. 300లోపే మరణాలు...

By AN TeluguFirst Published Sep 13, 2021, 11:48 AM IST
Highlights

దేశంలో గడిచిన 24 గంటల్లో 27,254 కొత్త కోవిడ్ -19 కేసులు, 219 మరణాలు నమోదయ్యాయి. కేరళలో 20,240 కోవిడ్ -19 కేసులు, 67 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

న్యూఢిల్లీ : వరుసగా రెండో రోజూ కోవిడ్ -19 ఇన్‌ఫెక్షన్ల రోజువారీ కొత్త కేసులలో దేశవ్యాప్తంగా సోమవారం గణనీయంగా తగ్గింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం... దేశంలో ఒకే రోజు 27,254 కరోనా కేసులు పెరిగాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 33,264,175 కి చేరుకుంది.

దేశంలో గడిచిన 24 గంటల్లో 27,254 కొత్త కోవిడ్ -19 కేసులు, 219 మరణాలు నమోదయ్యాయి. కేరళలో 20,240 కోవిడ్ -19 కేసులు, 67 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇదే సమయంలో, కరోనా యాక్టివ్ కేసుల్లో దాదాపు 10,652 తగ్గి ఇప్పుడు 3,74,269 కి చేరుకున్నాయి. ఉదయం 8 గంటలకు విడుదల చేసిన డేటా ప్రకారం, కోవిడ్ -19 సంబంధిత మరణాల సంఖ్య 44,28, 74కు చేరుకుంది.

"యాక్టివ్ కేసులు 3,74,269 కి తగ్గాయి, మొత్తం ఇన్ఫెక్షన్లలో 1.16 శాతం, కోవిడ్ -19 రికవరీ రేటు 97.51 శాతంగా నమోదైంది" అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 24 గంటల వ్యవధిలో యాక్టివ్ కేసుల సంఖ్య 10,652 తగ్గింది.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం...సెప్టెంబర్ 12 వరకు 54,30,14,076 మందికి కోవిడ్ -19 టెస్టులు చేశారు. దీంట్లో, నిన్న ఒక్కరోజే 12,08,247 పరీక్షలు చేశారు. రోజువారీ పాజిటివిటీ రేటు 2.26 శాతంగా నమోదైంది. గత 14 రోజులుగా ఇది 3 శాతం కంటే తక్కువగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 2.11% గా నమోదైంది. గత 80 రోజులుగా ఇది 3 శాతం కంటే తక్కువగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

దారుణం.. 14ఏళ్ల బాలికపై సుత్తితో దాడి.. అత్యాచారం..!

వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 32,44,70,32 కి పెరిగింది, అయితే మరణాల రేటు 1.33 శాతంగా నమోదైంది. దేశంలో నిర్వహించే కోవిడ్ వ్యాక్సిన్ మోతాదుల సంచిత సంఖ్య 74.38 కోట్లు దాటిందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

భారతదేశంలో కోవిడ్ -19 సంఖ్య 2020 ఆగస్టు 7న 20 లక్షలు, ఆగస్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు, సెప్టెంబర్ 16న 50 లక్షలు దాటింది. సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు దాటింది. అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షలు దాటింది. డిసెంబర్ 19న ఒక కోటి మార్కును అధిగమించింది. మే 4న భారతదేశం రెండు కోట్ల మైలురాయిని దాటింది. జూన్ 23న మూడు కోట్లు దాటింది.
 

click me!