ఇంట్లోనే బాయ్‌ఫ్రెండ్‌తో కూతురు రెడ్ హ్యాండెడ్‌గా దొరికింది.. అప్పుడు బిడ్డ చేసిన దారుణమిదే

By Mahesh KFirst Published May 30, 2023, 6:01 PM IST
Highlights

గుజరాత్‌లో దారుణం జరిగింది. కూతురిని ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో తల్లి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. తండ్రికి ఈ విషయం చెప్పొద్దని ప్రాధేయపడ్డ కూతురు.. కొంత సేపటికి తల్లిని దారుణంగా హతమార్చింది.
 

Murder: గుజరాత్‌లో షాకింగ్ మర్డర్ జరిగింది. కూతురు, ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో ఇంట్లో రెడ్ హ్యాండెడ్‌గా తల్లికి పట్టుబడింది. బాయ్ ఫ్రెండ్ పరుగు పెట్టాడు. తొలుత కూతురు తల్లి ముందు కన్నీరు పెట్టుకుంది. తండ్రికి చెప్పొద్దని ప్రాధేయపడింది. ఆ తర్వాత స్టోర్ రూమ్‌లోకి వెళ్లి ఒక రెచ్ పట్టుకువచ్చింది. తల్లి తలపై దానితో కొట్టింది. పలుమార్లు కొట్టిన తర్వాత తల్లి మరణించింది. ఈ ఘటన జునాగఢ్‌లోని ఇవ్నగర్‌లో చోటుచేసుకుంది.

తొలుత ఈ హత్య మిస్టీరియస్‌గా మారింది. హత్య జరిగినప్పుడు తాను ఇంట్లోనే ఉన్నానని చెప్పిన కూతురు.. కానీ, ఓ గదిలో ఉన్నా అని, తల్లి మరణించిన సంగతి తనకు తెలియదని పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది. తరుచూ ప్రశ్నలు వేయగా.. ఆమె చెప్పిన సమాధానాలు పొంతన లేకుండా పోయాయి. డీటెయిల్డ్‌గా ప్రశ్నించడంతో తల్లిని తానే హత్య చేశానని అంగీకరించింది.

35 ఏళ్ల దక్ష బమానియా ఇంటికి వచ్చే సరికి ఖంగు తిన్నది. ఇంట్లో కూతురు మీనాక్షి తన బాయ్‌ఫ్రెండ్‌తో కనిపించింది. దీంతో తల్లీ కూతుళ్ల మధ్య గొడవ జరిగింది. ఇంతలో బాయ్ ఫ్రెండ్ అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఆ తర్వాత ఈ విషయం తండ్రికి చెప్పొద్దని తల్లిని కోరింది.

Also Read: మణిపూర్‌లో శాంతి స్థాపనకు కట్టుబడి ఉన్నాం: కేంద్ర మంత్రి అమిత్ షా.. ‘పరిష్కారం కేంద్రం చేతిలోనే ఉంది’

కానీ, ఎందుకో తన తల్లిని ఆమె విశ్వసించలేకపోయిందని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి ఎస్ఏ గాధ్వి తెలిపారు. స్టోర్ రూమ్ నుంచి ఒక రెంచ్ తీసుకువచ్చి దక్ష తలపై పలుమార్లు దాడి చేసింది. ఆమె చనిపోయిన తర్వాత అసలేమీ జరగలేదన్నట్టుగా మీనాక్షి తన గదిలోకి వెళ్లి పడుకుందని గాధ్వి వివరించారు.

జునాగఢ్ తాలూక పోలీసు అధికారి సోమవారం మీనాక్షిని అరెస్టు చేశారు.

19 ఏళ్ల మీనాక్షి ఇటీవలే పదో తరగతి పాస్ అయింది. అప్పుడప్పుడు పనికి వెళ్లి కుటుంబానికి సాయం కూడా చేసేది.

click me!