కోవిడ్ సైడ్ ఎఫెక్ట్స్ : భారతీయుల్లో తీవ్రమవుతున్న ఊపిరితిత్తుల సమస్యలు..తాజా అధ్యయనం

Published : Feb 19, 2024, 10:01 AM IST
కోవిడ్ సైడ్ ఎఫెక్ట్స్ : భారతీయుల్లో తీవ్రమవుతున్న ఊపిరితిత్తుల సమస్యలు..తాజా అధ్యయనం

సారాంశం

కరోనా తరువాత కనిపించే దీర్ఘకాలిక సమస్యల్లో ఊపిరితిత్తుల డ్యామేజ్ ఒకటి. ఇది ఎక్కువగా భారతీయుల్లో కనిపిస్తోంది. 

ఢిల్లీ : కరోనావైరస్ ప్రభావం ఇప్పుడప్పుడే మానవాళిని వదిలేలా లేదు. కోవిడ్ బారిన పడిన వారిలో సైడ్ ఎఫెక్స్ రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. తాజాగా వెలువడిన ఓ అధ్యయనం ప్రకారం, కోవిడ్ బారినపడి కోలుకున్నవారిలో ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతున్నాయట. కోవిడ్ నుండి కోలుకున్న భారతీయులు.. యూరోపియన్లు, చైనీయుల కంటే ఎక్కుగా ఊపిరితిత్తుల పనితీరు సమస్యలతో బాధపడుతున్నారు.

కొన్ని సందర్భాల్లో ఈ దీర్ఘకాలిక లక్షణాలు  తగ్గుముఖం పట్టడానికి ఒక సంవత్సరం వరకు పట్టవచ్చు, మిగిలిన వారు జీవితాంతం దెబ్బతిన్న ఊపిరితిత్తులతో జీవించవలసి ఉంటుంది. భారతీయుల ఊపిరితిత్తుల పనితీరు, జీవన నాణ్యతపై COVID-19 ప్రభావంపై వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ చేసిన అధ్యయనంలో ఈ రిపోర్ట్ ప్రచురించబడింది.

రైతులతో ముగిసిన చర్చలు.. ఎంఎస్పీపై కేంద్రం కీలక ప్రాతిపాదనలు.. అందులో ఏముందంటే ?

"యూరోపియన్, చైనీస్ రోగుల కంటే మా భారతీయ సబ్జెక్టులు ఎక్కువ కోమోర్బిడిటీలను కలిగి ఉన్నాయని, ఊపిరితిత్తుల పనితీరులో ఎక్కువ బలహీనతను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది" అని అధ్యయనం పేర్కొంది. CMC ఈ అధ్యయనాన్ని భారతీయులపై మొదటి నివేదికగా పేర్కొంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు గంట‌లో వెళ్లిపోవ‌చ్చు.. దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్‌లో మ‌రో కీల‌క అడుగు
విజయ సంకల్ప యాత్రలో మోదీ స్పీచ్ కి దద్దరిల్లిన సభ | PM Narendra Modi Speech | Asianet News Telugu