యూపీ: కారు కొనేందుకు.. పురిటి బిడ్డ విక్రయం, స్వయంగా కన్నతల్లిదండ్రులే

Siva Kodati |  
Published : May 14, 2021, 04:35 PM IST
యూపీ: కారు కొనేందుకు.. పురిటి బిడ్డ విక్రయం, స్వయంగా కన్నతల్లిదండ్రులే

సారాంశం

జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే కన్నబిడ్డలకు మాత్రం ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలనుకుంటారు తల్లిదండ్రులు. తాము పస్తులు వుండైనా సరే బిడ్డల ఆకలి తీర్చే వారు ఎందరో. కానీ కారు కొనాలనే ఆశతో ఏకంగా పురిట్లోని బిడ్డనే అమ్మకానికి పెట్టారు ఓ కసాయి తల్లిదండ్రులు. 

జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే కన్నబిడ్డలకు మాత్రం ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలనుకుంటారు తల్లిదండ్రులు. తాము పస్తులు వుండైనా సరే బిడ్డల ఆకలి తీర్చే వారు ఎందరో. కానీ కారు కొనాలనే ఆశతో ఏకంగా పురిట్లోని బిడ్డనే అమ్మకానికి పెట్టారు ఓ కసాయి తల్లిదండ్రులు. 

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌ జిల్లా తిర్వా కొట్వాలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సతౌర్‌కి చెందిన ఓ మహిళ మూడు నెలల క్రితం మగ శిశువుకి జన్మనిచ్చింది. అయితే, వీరికి కారు కొనాలని ఆశ. అయితే అందుకు తగిన ఆర్ధిక స్తోమత వారి వద్ద లేదు.

దీంతో గురుసాహైగంజ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తను కలిసి బిడ్డను రూ.1.5 లక్షలకు విక్రయించారు. ఆ పసికందు అమ్మమ్మ, తాతయ్య గురువారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది.

బిడ్డ ఇప్పటికీ వ్యాపారి వద్దే ఉన్నాడని పోలీసుల విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శిశువును అమ్మకానికి పెట్టిన ఆ దంపతులను విచారణ కోసం పిలిచారు. తాము వ్యాపారి ఇచ్చిన డబ్బుతో ఇటీవలే పాత కారును కొనుగోలు చేశామని దంపతులు అంగీకరించారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం