నడుము భాగంలో అతుక్కొని పుట్టిన కవలలను విడదీసిన ఎయిమ్స్ వైద్యలు

Published : May 25, 2020, 03:19 PM IST
నడుము భాగంలో అతుక్కొని పుట్టిన కవలలను విడదీసిన ఎయిమ్స్ వైద్యలు

సారాంశం

24 గంటల పాటు శస్త్రచికిత్స చేసి నడుము భాగంలో అతుక్కొని పుట్టిన అవిభక్త  కవలలను ఎయిమ్స్ వైద్యులు విజయవంతంగా విడదీశారు.ఈ ఆపరేషన్ లో 64 మంది వైద్యులు పాల్గొన్నారు. వైద్య రంగంలో ఈ ఆపరేషన్ అత్యంత అరుదైందని చెబుతున్నారు.

న్యూఢిల్లీ: 24 గంటల పాటు శస్త్రచికిత్స చేసి నడుము భాగంలో అతుక్కొని పుట్టిన అవిభక్త  కవలలను ఎయిమ్స్ వైద్యులు విజయవంతంగా విడదీశారు.ఈ ఆపరేషన్ లో 64 మంది వైద్యులు పాల్గొన్నారు. వైద్య రంగంలో ఈ ఆపరేషన్ అత్యంత అరుదైందని చెబుతున్నారు.

ఎయిమ్స్ పీడియాట్రిక్ సర్జరీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ మిను బాజ్ పాయ్ నేతృత్వంలో వైద్యులు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. రెండు నెలల వయస్సు నుండి  పిల్లలు మిను బాజ్ పాయ్ పర్యవేక్షణలోనే ఉన్నారు. ప్రస్తుతం వీరి వయస్సు రెండేళ్లు. పిల్లల శరీరం శస్త్ర చికిత్సకు అనుకూలంగా ఉండడంతో ఆపరేషన్ నిర్వహించారు.

also read:జూన్‌లో కరోనా కేసులు మరింత తీవ్రమయ్యే ఛాన్స్: నిపుణుల వార్నింగ్

ఇద్ద‌రి శిశువుల‌ వెన్న‌ముక‌ ద‌గ్గ‌ర త‌గినంత చ‌ర్మం లేక‌పోవ‌డంతో గుండె, ప్ర‌ధాన ర‌క్త‌నాళాలకి స‌రిగ్గా రక్త ప్ర‌స‌ర‌ణ జ‌ర‌గ‌లేదు. దీంతో ఆప‌రేష‌న్ స‌మ‌యంలో చాలా స‌వాళ్ల‌ను ఎదుర్కొన్నట్టుగా వైద్యులు చెప్పారు. ఈ కేసును లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ఆపరేషన్ నిర్వహించినట్టుగా చెప్పారు.

అనస్థీషియాలజీ, ప్లాస్టిక్ సర్జరీ,  సి.టి.వి.ఎస్. డిపార్ట్‌మెంట్ ఆఫ్ రేడియోడయాగ్నోసిస్, న్యూరోఫిజియాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, బయోకెమిస్ట్రీ, నర్సింగ్ ,  పారామెడికల్ సిబ్బంది ఓ జ‌ట్టులా ఏర్ప‌డి 24 గంట‌ల‌పాటు సుధీర్ఘంగా క‌ష్ట‌ప‌డి ఆప‌రేష‌న్‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేసిన‌ట్లు ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు.ఈ ఆప‌రేష‌న్‌ను విజ‌య‌వంతం కావ‌డం ప‌ట్ల క‌వ‌ల పిల్లల తల్లిదండ్రులు ఆనందం వ్య‌క్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Udhayanidhi Stalin Speech: తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉదయనిధి స్టాలిన్ సూపర్ స్పీచ్| Asianet Telugu
Nitish Kumar Takes Oath in Rajya Sabha: రాజ్యసభలో నితీశ్ కుమార్ ప్రమాణం | Asianet News Telugu