తులాభారంలో తెగిన త్రాసు: శశిథరూర్‌కు తీవ్రగాయాలు, తలకు కుట్లు

Siva Kodati |  
Published : Apr 15, 2019, 01:45 PM IST
తులాభారంలో తెగిన త్రాసు: శశిథరూర్‌కు తీవ్రగాయాలు, తలకు కుట్లు

సారాంశం

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ గాయపడ్డారు. మలయాళీల నూతన సంవత్సరాది విషు పండుగను పురస్కరించుకుని తంపనూర్ ప్రాంతంలోని గాంధారి అమ్మన్ కోవిళ్ ఆలయంలో శశిథరూర్ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ గాయపడ్డారు. మలయాళీల నూతన సంవత్సరాది విషు పండుగను పురస్కరించుకుని తంపనూర్ ప్రాంతంలోని గాంధారి అమ్మన్ కోవిళ్ ఆలయంలో శశిథరూర్ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆలయంలో తులాభారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమయంలో ఆయన కూర్చొన్న త్రాసు ఒక్కసారిగా తెగి కిందపడింది. ఈ ఘటనలో శశిథరూర్ కాలికి, తలకు గాయమైంది. దీంతో ఆయన్ను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

థరూర్ తలకు తీవ్ర గాయాలవ్వడంతో వైద్యులు ఆయనకు ఆరు కుట్లు వేశారు. ప్రస్తుతం థరూర్ క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగారు.

PREV
click me!

Recommended Stories

భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu
PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu