అసలు సమస్యల నుంచి దృష్టిని మళ్లించడానికి ఆ విషయాన్ని అడ్డుపెట్టుకున్నారు.. ప్రధాని మోడీపై కాంగ్రెస్ విమర్శలు 

Published : Nov 16, 2022, 08:11 PM IST
అసలు సమస్యల నుంచి దృష్టిని మళ్లించడానికి ఆ విషయాన్ని అడ్డుపెట్టుకున్నారు.. ప్రధాని మోడీపై కాంగ్రెస్ విమర్శలు 

సారాంశం

భారతదేశం G20 అధ్యక్ష పదవిని పొందిన తర్వాత అసలు సమస్యల నుండి దృష్టిని మళ్లించడానికి 'ప్రపంచంలోనే అతిపెద్ద ఈవెంట్ మేనేజర్'( ప్రధాని మోడీ) వచ్చే ఏడాది భారతదేశంలో జరగనున్న శిఖరాగ్ర సమావేశాన్ని ఉపయోగించుకుంటున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. 

G-20 సమ్మిట్: జి-20 అధ్యక్ష పదవిని భారత్‌కు అప్పగించిన సందర్భంగా కాంగ్రెస్ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేసింది. దేశంలోని అసలు సమస్యల నుండి దృష్టిని మళ్లించడానికి 'ప్రపంచంలోనే అతిపెద్ద ఈవెంట్ మేనేజర్' వచ్చే ఏడాది భారతదేశంలో జరగనున్న శిఖరాగ్ర సమావేశాన్ని ఉపయోగించుకుంటున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ విషయాన్ని 2024 లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తారని విమర్శించింది. 

ప్రధాని మోదీపై జైరాం రమేష్‌ విమర్శలు  

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్వీట్ చేస్తూ.. 19 ప్రధాన ఆర్థిక వ్యవస్థలు, యూరోపియన్ యూనియన్‌తో కూడిన G20 గ్రూప్ 1999లో స్థాపించబడింది. 2008 నుండి ప్రతి సభ్య దేశంలో వార్షిక శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది.  ప్రతి సభ్య దేశానికి అవకాశం లభిస్తుంది. భారతదేశం 2023లో శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇస్తుంది. గతంలో జరిగిన ఇలాంటి శిఖరాగ్ర సమావేశాల మాదిరిగానే దీన్ని స్వాగతించాల్సిందేనని రమేష్ అన్నారు. 1983లో న్యూ ఢిల్లీలో 100 దేశాలకు చెందిన నాన్-అలైన్డ్ సమ్మిట్ జరిగింది, ఆ తర్వాత కామన్వెల్త్ సమ్మిట్ జరిగింది. 2023 సమ్మిట్‌ను అడ్డం పెట్టుకుని ప్రపంచంలోనే అతిపెద్ద ఈవెంట్ మేనేజర్ అయినట్టు .. వచ్చే ఏడాదిలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో వాస్తవ సమస్యల నుంచి దృష్టి మరల్చడం ఖాయమని ఆయన ఆరోపించారు.

జి-20లో ప్రధాని మోదీ సందేశం

ఇండోనేషియాలోని బాలిలో జరిగిన శిఖరాగ్ర సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రపంచం మొత్తం ఆర్థిక సవాళ్లు, భౌగోళిక రాజకీయ వైరుధ్యాలు, కరోనా వంటి మహమ్మారితో సతమతమవుతున్న తరుణంలో జి20కి అధ్యక్షత వహించే బాధ్యతను భారత్ తీసుకుంటోంది. అటువంటి సమయంలో ప్రపంచం G20 వైపు ఆశతో చూస్తోంది.  G-20 ఛైర్మన్‌షిప్ యాక్షన్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. ఈ బాధ్యతలు భారత్  ప్రతిష్టాత్మకంగా, నిర్ణయాత్మకంగా, కార్యాచరణ  నిర్వర్తిస్తోందని అన్నారు.

ఇండోనేషియా బుధవారం (నవంబర్ 17) బాలి శిఖరాగ్ర సమావేశం ముగియడంతో వచ్చే ఏడాది పాటు జి20 అధ్యక్ష బాధ్యతలను భారత్‌కు అప్పగించింది.ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో జీ20 అధ్యక్ష బాధ్యతలను ప్రధాని మోదీకి అందజేశారు. వచ్చే ఏడాది 2023లో డిసెంబర్ 1 నుంచి జి-20 అధ్యక్ష పదవిని భారత్ అధికారికంగా చేపట్టనుంది. తదుపరి G20 లీడర్స్ సమ్మిట్ న్యూ ఢిల్లీలో 9 నుండి 10 సెప్టెంబర్ 2023 తేదీలలో జరుగుతుంది.

G-20 సమూహం అనేది ప్రపంచంలోని ప్రధాన అభివృద్ధి చెందిన,అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల కూటమి. ఇందులో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్, ఐరోపా లు సభ్య దేశాలు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu