రాహుల్ గాంధీ అనర్హత వేటుపై రెండో రోజుకు కాంగ్రెస్ నిరసనలు.. టాప్ పాయింట్స్

Published : Mar 27, 2023, 10:58 AM IST
రాహుల్ గాంధీ అనర్హత వేటుపై రెండో రోజుకు కాంగ్రెస్ నిరసనలు..  టాప్ పాయింట్స్

సారాంశం

New Delhi: నాలుగేళ్ల నాటి పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న లోక్‌సభ సభ్యత్వం రద్దయింది. 2019 పరువునష్టం కేసులో దోషిగా తేలడంతో లోక్ సభ నుంచి తొలగించిన తర్వాత కాంగ్రెస్ దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌ల‌కు దిగింది. అధికార పార్టీపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది.  

Congress protests across the country-Day 2: కాంగ్రెస్ నాయకుడు, వాయనాడ్ మాజీ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు రెండో రోజుకు చేరుకోగా, పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రాలు.. ప్రభుత్వం ఒక అమరవీరుడి కుమారుడి గొంతును అణచివేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నాలుగేళ్ల నాటి పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న లోక్‌సభ సభ్యత్వం రద్దయింది. 2019 పరువునష్టం కేసులో దోషిగా తేలడంతో లోక్ సభ నుంచి తొలగించిన తర్వాత కాంగ్రెస్ దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌ల‌కు దిగింది. అధికార పార్టీపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది.

కాంగ్రెస్ నిరసనలకు సంబంధించి టాప్ పాయింట్లు.. 

  • ఢిల్లీలోని రాజ్ ఘాట్ వెలుపల కాంగ్రెస్ కార్యకర్తలు ఒక రోజు 'సంకల్ప సత్యాగ్రహం' నిర్వహిస్తుండగా రాహుల్ గాంధీని, నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులను బీజేేపీ ప్రతిరోజూ అవమానిస్తోందని ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు.
  • మహాత్మాగాంధీ స్మారక చిహ్నం వద్ద నిరసన తెలిపేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో కాంగ్రెస్ పార్టీ ఒక రోజు నిరసనకు వేదికను ఏర్పాటు చేసింది.
  • భావసారూప్యత కలిగిన ప్రతిపక్షాలు సోమవారం ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత ఉదయం 10.30 గంటలకు పార్లమెంటులోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎంపీలు సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
  • రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన తర్వాత శుక్రవారం లోక్ సభ జరుగుతున్న తొలి సమావేశాల్లో నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు నల్ల దుస్తులు ధరించి సభకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
  • పార్టీ నేతలు పీ.చిదంబరం, జైరాం రమేష్, సల్మాన్ ఖుర్షీద్, ప్రమోద్ తివారీ, అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్, అధిర్ రంజన్ చౌదరి కూడా రాజ్ఘాట్ వెలుపల నిరసనలో పాల్గొన్నారు.
  • అయితే రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన రాజ్యాంగ సవరణ చట్టాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని బీజేపీ ఆరోపించింది.
  • దేశ రాజధాని ఢిల్లీతో పాటు హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, జమ్మూకాశ్మీర్, పంజాబ్, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనల్లో పాల్గొన్నారు.
  • గుజరాత్లో అహ్మదాబాద్ లోని లాల్ దర్వాజాకు నిరసన తెలిపేందుకు వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ జగదీశ్ తాహోర్, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అమిత్ చావ్డా, సీనియర్ నేత భరత్సింగ్ సోలంకితో పాటు పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
  • పుదుచ్చేరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాహార దీక్ష చేస్తుందని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వి.నారాయణస్వామి ఆదివారం తెలిపారు.
  • 'మోడీ ఇంటిపేరు' ఉన్నవారు దొంగలేనా అని అడిగినందుకు గుజరాత్ లో ఓ బీజేపీ నేత దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?
Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?