Smriti Irani on National Herald case: రూ. 2,000 కోట్ల ఆస్తిని కాపాడ‌టానికే నిరసనలు: స్మృతి ఇరానీ

Published : Jun 13, 2022, 03:01 PM IST
Smriti Irani on National Herald case:  రూ. 2,000 కోట్ల ఆస్తిని కాపాడ‌టానికే నిరసనలు: స్మృతి ఇరానీ

సారాంశం

Smriti Irani on National Herald case: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి మద్దతుగా నిలిచిన‌ నేతలు, కార్యకర్తలపై స్మృతి ఇరానీ దాడి చేశారు. గాంధీ కుటుంబ ఆస్తులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విరుచుక‌ప‌డింది.     

 Smriti Irani on National Herald case: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఈడీ నేడు విచారిస్తుంటే.. ఓ వైపు కాంగ్రెస్ నేతలు రోడ్డుపై బైఠాయించి నిర‌స‌న తెలుపుతున్నారు. మరోవైపు బీజేపీ నేత‌లు మీడియా సమావేశం పెట్టి కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుక‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్ నేత‌లు చేస్తున్న నిర‌స‌న‌లు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి కాదనీ, త‌న నేత‌ రాహుల్ గాంధీ యొక్క ₹ 2,000 కోట్ల విలువైన ఆస్తులను కాపాడటానికి నిరసన వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు.

నిర‌స‌న‌ల‌తో దర్యాప్తు సంస్థలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నార‌నీ, అక్రమంగా సంపాదించిన సంపద ను రక్షించడానికి దర్యాప్తు సంస్థపై ఏ రాజకీయ కుటుంబం ఇలా ప్రయత్నించలేదని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు తమ అవినీతిని బయటపెట్టినందున బహిరంగంగా దర్యాప్తు సంస్థపై ఒత్తిడి తెచ్చేందుకు వీధుల్లోకి వచ్చారని విమ‌ర్శించింది. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, రాహుల్ గాంధీ కూడా కాదని ఆమె తేల్చిచెప్పారు.

నేష‌న‌ల్ హెరాల్డ్ కేసును మీడియాకు వివరిస్తూ.. 1930లో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) అనే కంపెనీని వార్తాపత్రికను ప్రచురించే ఉద్దేశ్యంతో స్థాపించారనీ, ఇందులో 5,000 మంది స్వాతంత్య్ర‌ సమరయోధులు వాటాదారులుగా ఉన్నారని, అయితే ఇప్పుడు గాంధీ కుటుంబ నియంత్రణలో ఉందని ఆమె చెప్పారు. వార్తాపత్రికలను ప్రచురించకుండా, రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారడానికి కంపెనీ యాజమాన్యం ఒక కుటుంబానికి బదిలీ చేయబడిందని ఆమె ఆరోపించారు. 

90 కోట్ల రుణమాఫీ - స్మృతి ఇరానీ

స్మృతి ఇరానీ ఇంకా మాట్లాడుతూ, 2008 సంవత్సరంలో ఈ కంపెనీ స్వయంగా 90 కోట్ల రూపాయల రుణం తీసుకుందని, ఇప్పుడు ఈ కంపెనీ ప్రాపర్టీ వ్యాపారంలోకి రావాలని నిర్ణయించుకుంది. ఈ క్ర‌మంలోనే 2010లో రూ.5 లక్షల ప్రారంభ మూలధనంతో  యంగ్ ఇండియా పేరుతో ఓ కంపెనీని ఏర్పాటు చేసి అందులో రాహుల్ గాంధీ డైరెక్టర్ గా చేరారు. కంపెనీలో 75 శాతం వాటా దారుడుగా రాహుల్ గాంధీ ఉండ‌గా.. మిగిలినది ఆయన తల్లి సోనియా గాంధీతో స‌హా మోతీలాల్ వోరా, ఫెర్నాండెజ్ వంటి ప‌లువురు కాంగ్రెస్ నాయకులు వాటాదారులుగా ఉన్నారు.  

దీని తర్వాత AJL యొక్క 9 కోట్ల షేర్లు యంగ్ ఇండియాకు ఇవ్వబడ్డాయి. 9 కోట్ల షేర్‌తో ఈ కంపెనీ 99 శాతం షేర్లను యంగ్ ఇండియా దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ AJL కంపెనీకి 90 కోట్ల రుణాన్ని ఇచ్చింది, అది తరువాత మాఫీ అవుతుంద‌ని తెలిపారు. ప్రజాస్వామ్య కార్యకలాపాల్లో పాల్గొనేందుకు వీలుగా కాంగ్రెస్ పార్టీకి విరాళాలు ఇచ్చిన వారు తమ డబ్బును గాంధీ కుటుంబానికి చెందిన కంపెనీకి వెళ్లాలని భావిస్తున్నారా అని ఆమె ప్రశ్నించారు.

ఈ కంపెనీ సోషల్ వర్క్ చేయడానికి ఏర్పాటు చేయబడలేదు. ఇది స్థాపించబడిన సమయంలో కంపెనీల చట్టంలోని సెక్షన్ 25 కింద లైసెన్స్‌ని తీసుకుంది, దీని ప్రకారం ఇది స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు మాత్రమే చేయగలదు. కానీ 2016లో యంగ్ ఇండియా దానిని అంగీకరించింది. అది ఉనికిలో ఉన్న ఆరేళ్లలో  ఎలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయలేదని ఆమె చెప్పారు. ఈ సంస్థ సామాజిక సేవ కోసం ఏర్పాటు చేయబడిన‌ట్టు  అయితే.. అది గాంధీ కుటుంబం కోసం పనిచేస్తుందని శ్రీమతి ఇరానీ ఆరోపించారు. 
 
2000 కోట్ల ఆస్తిని కాపాడేందుకు ప్రయత్నాలు 

రాహుల్ గాంధీకి మద్దతుగా ఢిల్లీలో నిర‌స‌న తెలిపిన కాంగ్రెస్ నేతలను ఓ ప్ర‌శ్న అడిగింది.  రాహుల్ గాంధీకి  డెక్స్ మర్చండైజ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో సంబంధం ఏమిటి? Dotex Merchandise Private Limited కోల్‌కతాలోని హవాలా ఎంట్రీ ఆపరేటర్‌తో లింక్ చేయబడింది, ఇది నగదుకు బదులుగా చెక్కులను ఇస్తుంది. ఈ కంపెనీ ఆర్థిక లావాదేవీలపై ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ రెడ్ ఫ్లాగ్ చేసిందని మంత్రి ఇరానీ చెప్పారు. నేడు రాహుల్ గాంధీ పిలుపు మేరకు.. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చేస్తున్నది ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం కాదని.. గాంధీ కుటుంబానికి చెందిన 2000 కోట్ల ఆస్తులను కాపాడే ప్రయత్నమ‌ని విమ‌ర్శించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Slowest Train: కదిలే స్వర్గం ఊటీ టాయ్ ట్రైన్.. సైకిల్ వేగంతో వెళ్లే ఈ రైలు ప్రయాణానికి ఎందుకంత క్రేజ్?
అజిత్ ని పరామర్శించిన సీఎం విజయ్, త్రిష | Ajith Kumar Mother Demise | Asianet News Telugu