national herald case : ముగిసిన రాహుల్ గాంధీ విచారణ .. 10 గంటల పాటు ప్రశ్నల వర్షం, రేపు మరోసారి రావాలన్న ఈడీ

Siva Kodati |  
Published : Jun 13, 2022, 09:47 PM ISTUpdated : Jun 13, 2022, 09:50 PM IST
national herald case : ముగిసిన రాహుల్ గాంధీ విచారణ .. 10 గంటల పాటు ప్రశ్నల వర్షం, రేపు మరోసారి రావాలన్న ఈడీ

సారాంశం

నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 10 గంటల పాటు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు. దీనిపై రాహుల్ వద్ద నుంచి లిఖిత పూర్వకంగా సమాధానాలు తీసుకుంది ఈడీ

నేషనల్ హెరాల్డ్ కేసుకు (national herald case) సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత (congress) రాహుల్ గాంధీ (rahul gandhi) ఈడీ విచారణ ముగిసింది. దాదాపు పది గంటల పాటు ఆయనను ప్రశ్నించారు ఎన్‌ఫోర్స్‌మెంట్ (enforcement directorate) అధికారులు. దీనికి సంబంధించి రాహుల్ వద్ద నుంచి లిఖిత పూర్వకంగా సమాధానాలను తీసుకుంటోంది. రాహుల్ ఇచ్చచే సమాధానాలనే వ్యక్తిగత ఒప్పుకోలును సాక్ష్యాలుగా పరిగణించనుంది ఈడీ. ఉదయం మూడు గంటలు , సాయంత్రం ఐదున్నర గంటలు మొత్తం ఎనిమిదిన్నదర గంటల పాటు ఈడీ అధికారులు రాహుల్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన ఈ విచారణ లంచ్ బ్రేక్ నిమిత్తం 2.30 గంటలకు ముగిసింది. అనంతరం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై రాత్రి 9.30 గంటలకు ముగిసింది. 

నేషనల్ హెరాల్డ్ కేసు ఏమిటీ?

రూ. 2000 కోట్ల విలువలైన అసెట్స్‌ ఈక్విటీ ట్రాన్సాక్షన్‌లో అవకతవకలకు సంబంధించినదే ఈ కేసు. నేషనల్ హెరాల్డ్ పేపర్‌కు ఆర్థిక సమస్యలు తలెత్తినప్పుడు కాంగ్రెస్ పార్టీ పలుదఫాలుగా సొమ్ము అందించింది. సుమారు రూ. 90 కోట్లు అందించినా 2008లో ఈ పత్రిక మూతపడక తప్పలేదు.

అయితే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బోర్డు డైరెక్టర్లుగా యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది స్థాపితమైంది. ఈ యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ 2010లో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌ను టేకోవర్ చేసుకుంది. అనంతరం బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి ఈ వ్యవహారంపై ఆరోపణలు సంధించారు. అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్‌ను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ మోసపూరితంగా అధీనం చేసుకుందని కంప్లైంట్ చేశారు. ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం, పొలిటికల్ సంస్థ థర్డ్ పార్టీతో ఆర్థిక లావాదేవీలు జరపరాదు.

అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు సంబంధించిన ఆస్తులను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎక్కువ మొత్తంలో లాభంతోనే సొంతం చేసుకున్నారని స్వామి ఆరోపించారు. యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కేవలం రూ. 50 లక్షలు చెల్లించి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు చెందిన ఆస్తులను రికవరీ చేసుకునే హక్కును పొందింది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కాంగ్రెస్‌కు బాకీపడ్డ సుమారు రూ. 89.5 కోట్లు రద్దు అయినట్టు స్వామి ఆరోపించారు. తద్వార ఆ సొమ్ము అంతా వీరు పొందారని (మనీలాండరింగ్?) సుబ్రమణియన్ స్వామి ఫిర్యాదు చేశారు.

2016 నుంచి ఈడీ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌, పలువురు కాంగ్రెస్ లీడర్లను ఇన్వెస్టిగేట్ చేస్తున్నది. యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది కేవలం చారిటీ కోసం స్థాపించిన ఎన్జీవో సంస్థ అని కాంగ్రెస్ వాదిస్తున్నది. ఈ ట్రాన్సాక్షన్స్ కమర్షియల్ అని, ఫైనాన్షియల్ కాదని పేర్కొంటున్నది. అసలు ఆస్తులు లేదా నగదు అనేది బదిలీనే కాలేదుని, అలాంటప్పడు మనీలాండరింగ్ కేసు ఎలా అవుతుందని అభిషేక్ సింఘ్వీ వాదిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Viral News: రాత్రి ఫ్లాట్‌లో ఇద్దరు అమ్మాయిలతో ఉన్న యువకుడు.. సొసైటీ చేసిన పనికి రచ్చ, రచ్చ
బాంబు బెదిరింపులు.. హైదరాబాద్ ప్లైట్ అహ్మదాబాద్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్