పాక్ అధ్యక్షుడితో కాంగ్రెస్ నేత శత్రుఘన్ సిన్హా భేటీ

By telugu teamFirst Published Feb 23, 2020, 3:51 PM IST
Highlights

పెళ్లి వేడుకలో పాలుపంచుకునేందుకు పాకిస్తాన్ కి వెళ్లిన సిన్హా ఆ ఈవెంట్ తరువాత లాహోర్ లో పాక్ అధ్యక్షుడితో సమావేశమయ్యారు. శాంతిని నెలకొల్పడం నుంచి కాశ్మీర్ వరకు అనేక విషయాలు వీరిరువురి మధ్య చర్చకొచ్చినట్టు మీడియాకు ఆరిఫ్  కార్యాలయం తెలిపింది. 

ఎప్పుడు వార్తల్లో ఉండే నాయకుడు శత్రుగన్ సిన్హా తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు. ఆయన పాకిస్తాన్ అధ్యక్షుడితో లాహోర్ లో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సరిహద్దుల వెంట శాంతి వారధులను నెలకొల్పాల్సిన అవసరం ఉందని, శాంతి నెలకొల్పడం గురించి సిన్హా తో చర్చించినట్టు పాక్ అధ్యక్షుడు ట్విట్టర్ ద్వారా తెలిపారు. 

ఒక పెళ్లి వేడుకలో పాలుపంచుకునేందుకు పాకిస్తాన్ కి వెళ్లిన సిన్హా ఆ ఈవెంట్ తరువాత లాహోర్ లో పాక్ అధ్యక్షుడితో సమావేశమయ్యారు. శాంతిని నెలకొల్పడం నుంచి కాశ్మీర్ వరకు అనేక విషయాలు వీరిరువురి మధ్య చర్చకొచ్చినట్టు మీడియాకు ఆరిఫ్  కార్యాలయం తెలిపింది. 

ఇరువురు కూడా ఉపఖండంలో శాంతిని నెలకొల్పడం ఎందుకు అవసరమో నొక్కిచెబుతూ... దానికి ఎం చేయాలనుకుంటున్నారో కూడా చర్చించారని ఆ ప్రకటనలో పాక్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. 

చాలా విషయాల గురించి చర్చించామని, సామాజిక పరిస్థితుల నుంచి సాంస్కృతిక అంశాలవరకు అనేక విషయాలు తమ మధ్య చర్చకు వచ్చాయని సిన్హా ట్విట్టర్ వేదికగా తెలిపాడు. పాక్ అధ్యక్షుడితో జరిగిన సంభాషణ గురించి కొన్ని వరుస ట్వీట్లలో అనేక ఆసక్తికర విషయాలను తెలిపాడు సిన్హా. 

విదేశీ గడ్డపై ఉన్నప్పుడు రాజకీయాల గురించి మాట్లాడే స్థానంలో లేనప్పుడు రాజకీయ అంశాల గురించి మాట్లాడబోనని, తనకు ఆ విషయం తెలుసుననై, అందువల్లే రాజకీయాల గురించి తమ మధ్య ఎటువంటి చర్చ జరగలేదని తెలిపారు శత్రుఘన్ సిన్హా. 

was discussed. Nothing political or official about it. My friends, well-wishers and supporters and of course the media should realize that one shouldn't discuss the politics or policies of countries on foreign soil when one isn't competent, qualified & authorized by the Govt. pic.twitter.com/F6toXLXUjx

— Shatrughan Sinha (@ShatruganSinha)

Mian Ahmed is the worthy grandson of the most celebrated filmmaker & pioneers of Pakistan film industry .This is purely a personal visit nothing official, nor political about it. The Eshan family have visited us several times in the past & the last time for my son pic.twitter.com/0XkiKoZkNa

— Shatrughan Sinha (@ShatruganSinha)

ఈ సమావేశానికి వెళ్లే ముందు... ఇలా పాకిస్తాన్ పర్యటనకు రావడం తన వ్యక్తిగతమని అంటూ ఒక ట్వీట్ చేసారు. పాకిస్తాన్ ఫిలిం మేకర్ మియాన్ ఎహసాన్ మనవడి వివాహ వేడుకకు హాజరయ్యేందుకు మాత్రమే పాకిస్తాన్ వెళ్లినట్టు శత్రుఘన్ సిన్హా తెలిపారు. 

on the invite of great businessman,entrepreneur#MianAsadEshan & his wife, our bhabhi#MrsSamy.He is a dear family friend & my wife ’s rakhi brother. I’m here representing my family for the wedding of Mian Asad Eshan’s son#MianAhmedAsad’s wedding with . pic.twitter.com/a85NumcYeS

— Shatrughan Sinha (@ShatruganSinha)
click me!