టిప్పు సుల్తాన్‌ను నమ్మే వారు ప్రజలకు మేలు చేయలేరు: కాంగ్రెస్, జేడీ(ఎస్)లపై అమిత్ షా మండిపాటు.

Published : Feb 12, 2023, 03:23 AM IST
టిప్పు సుల్తాన్‌ను నమ్మే వారు ప్రజలకు మేలు చేయలేరు: కాంగ్రెస్, జేడీ(ఎస్)లపై అమిత్ షా మండిపాటు.

సారాంశం

కాంగ్రెస్, జేడీ(ఎస్)లు 18వ శతాబ్దపు మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్‌ను విశ్వసిస్తున్నాయని, ఆ రెండు పార్టీలు కర్ణాటకకు ఎలాంటి మేలు చేయలేవని, 16వ శతాబ్దపు తుళువ రాణి స్ఫూర్తితో అధికార బీజేపీ పనిచేస్తుందని అన్నారు.  

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద ఘటనలు, ఈశాన్య ప్రాంతంలో తిరుగుబాటు, వామపక్ష నక్సలిజాన్ని నియంత్రించడంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం చాలా వరకు విజయం సాధించిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ) వంటి సంస్థల చర్యలను కేంద్ర ఏజెన్సీలు, పోలీసు బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయని, పీఎఫ్‌ఐపై ఆంక్షలు విధించడంలో కేంద్రం విజయం సాధించిందని అన్నారు. ప్రజాస్వామ్యం పట్ల ప్రభుత్వానికి ఎంత నిబద్ధత, ఎంత బలం ఉందో దీన్ని బట్టి అర్థమవుతోందని షా అన్నారు. 

సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎస్‌విపిఎన్‌పిఎ)లో ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపిఎస్) 74వ బ్యాచ్ ప్రొబేషనర్ల దీక్షా కవాతులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించరాదన్న విధానం, ఉగ్రవాద నిరోధక చట్టాలకు పటిష్టమైన ఫ్రేమ్‌వర్క్, ఏజెన్సీల పటిష్టత, రాజకీయ సంకల్ప బలం వల్ల ఉగ్రవాద ఘటనలు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. గత ఏడు దశాబ్దాల కాలంలో దేశం అంతర్గత భద్రతలో ఎన్నో ఒడిదుడుకులతో పాటు ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని షా అన్నారు. ఈ సవాలు సమయంలో 36 వేల మందికి పైగా పోలీసులు తమ ప్రాణాలను అర్పించారని గుర్తు చేశారు. 

కాంగ్రెస్‌, జేడీఎస్‌లు టిప్పు సుల్తాన్‌ను విశ్వసిస్తున్నాయి

అనంతరం.. కర్ణాటకలోని పుత్తూరులో సెంట్రల్ అరెకానట్ , కోకో మార్కెటింగ్ మరియు ప్రాసెసింగ్ కోఆపరేటివ్ లిమిటెడ్ (క్యాంప్కో) స్వర్ణోత్సవ వేడుకల్లో మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, జెడీఎస్ లపై  విరుచుకుపడ్డారు. 18వ శతాబ్దపు మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్‌ను కాంగ్రెస్, జెడిఎస్ నమ్ముతున్నాయని అన్నారు. ఈ రెండు పార్టీలు కర్ణాటకకు మేలు చేయలేవనీ, కాంగ్రెస్ అవినీతిలో కూరుకుపోయిందన్నారు. గాంధీ కుటుంబానికి కర్ణాటకను ఏటీఎంగా ఉపయోగించుకున్నాయని ఆరోపించారు.

భారతదేశానికి జమ్మూకాశ్మీర్ ఓ కిరీటం

ప్రజలను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ, కర్ణాటకలోని గత కాంగ్రెస్ ప్రభుత్వం 1,700 మంది పిఎఫ్‌ఐ సభ్యులను వదిలివేసిందని ఆరోపించారు. రాహుల్ భాయ్, కాంగ్రెస్‌లు జాగ్రత్తగా వినాలని అన్నారు. ఇది మోడీ ప్రభుత్వం, రక్తపాతం గురించి మాట్లాడడం తప్ప గులకరాయి విసిరేందుకు కూడా ఎవరూ సాహసించలేరు. కశ్మీర్‌లో ఆర్టికల్-370ని రద్దు చేయడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ కాశ్మీర్‌ను భారతదేశానికి కిరీటంగా మార్చారని అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ram Mohan Naidu Speech | Tuticorin Airport Renamed as Thoothukudi Airport | Asianet News Telugu
Rammohan Naidu Launches Amazon Air First Cargo Flight from Delhi to Guwahati | Asianet News Telugu