The Kerala Story: సీఎం యోగి సంచలన నిర్ణయం.. మండిపడుతోన్న కాంగ్రెస్ 

Published : May 10, 2023, 03:53 AM IST
The Kerala Story: సీఎం యోగి సంచలన నిర్ణయం.. మండిపడుతోన్న కాంగ్రెస్ 

సారాంశం

The Kerala Story: ది కేరళ స్టోరీ సినిమాకు పన్ను మినహాయింపు ప్రకటించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని బహిరంగంగా ఉల్లంఘించడమేనని విమర్శలు గుప్పిస్తోంది

The Kerala Story: కేరళ అమ్మాయిలను నమ్మించి ముస్లింలుగా మార్చి సిరియాలో ఐసిస్ ఉగ్రవాద గ్రూపుల్లో చేర్పించే ఇతివృత్తంతో రూపొందించిన కేరళ స్టోరీ(The Kerala Story). ఈ సినిమా ట్రైలర్ విడుదల నుంచే వివాదాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే పలు రాష్ట్రప్రభుత్వాలు ఈ సినిమాపై నిషేధం విధించాయి.  అయితే.. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యూపీలో కేరళ స్టోరీ సినిమాకు పన్ను మినహాయింపు ప్రకటిస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. దిగజారిన రాజకీయాలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించింది.

ఈ అంశంపై యూపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ మంత్రి అజయ్ రాయ్ మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌లో కేరళ స్టోరీ చిత్రాన్ని పన్ను రహితంగా మార్చే అంశంపై ప్రశ్నలు లేవనెత్తారు. ప్రవర్తనా నియమావళిని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం బహిరంగంగా ఉల్లంఘించిందని ఆయన అన్నారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కూడా ఆయన అన్నారు. 
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో మునిసిపల్ ఎన్నికలు జరుగుతున్నాయని, ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఓటింగ్‌కు ముందే కేరళ స్టోరీ సినిమాపై ప్రభుత్వం పన్ను రహితం చేసిందని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీ ఇలాంటి ప్రకటన చేసిందనీ,  ఉత్తరప్రదేశ్, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో మిగిలిన మునిసిపల్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం మతతత్వ సందేశం ఇచ్చినందుకు కేరళ సోర్టీ సినిమాపై యూపీ ప్రభుత్వం ఈ ప్రకటన చేసిందనీ, ఈ ఆంశంపై ఎన్నికల సంఘం దృష్టి సారించాలని ఆయన అన్నారు. 

 వాస్తవానికి..కేరళ చిత్రాన్ని యూపీలో పన్ను రహితంగా రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ప్రకటించారు. యూపీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ముగిసిన తర్వాత, సీఎం యోగి ఆదిత్యనాథ్ మొత్తం క్యాబినెట్‌తో 'ది కేరళ స్టోరీ' చూస్తారు. చాలా రాష్ట్రాల్లో కేరళ స్టోరీ సినిమాను ట్యాక్స్ ఫ్రీ చేయాలనే డిమాండ్ ఉంది. 

అయితే తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఈ సినిమాపై నిషేధం విధించారు. ‘ది కేరళ స్టోరీ’ సినిమా ట్రైలర్‌ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా వివాదాల్లో చిక్కుకోవడంతో పాటు వార్తల్లో నిలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో దుష్ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. ఇన్ని చేసినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది.

ఎన్ని విమర్శలు, వివాదాలు ఎదురైనా 'ది కేరళ స్టోరీ' సినిమా రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. కేరళ స్టోరీ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి చెప్పాలంటే..విడుదలైన మూడవ రోజు ఈ చిత్రం దాదాపు 35.25 కోట్ల రూపాయలను రాబట్టింది. 1300 స్క్రీన్లలో విడుదలైన ఈ సినిమా తొలిరోజు (శుక్రవారం) రూ.8.03 కోట్లు రాబట్టింది. ఇక రెండో రోజు శనివారం రూ.11.22 కోట్ల బిజినెస్ చేసింది. ఈ చిత్రం ప్రేక్షకులను సందడి చేస్తోంది. ప్రేక్షకుల స్పందన చూస్తుంటే సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చిందనిపిస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kedarnath Yatra Update: కేదార్ నాథ్ యాత్రకు శరవేగంగా ఏర్పాట్లు| Asianet News Telugu
RBI : సైబర్ దొంగతనాలకు 'కిల్ స్విచ్' తో చెక్.. అంటే ఏమిటో తెలుసా..?