Amit Shah: "అస్సాంలో ఆ చట్టాన్ని పూర్తిగా తొల‌గిస్తాం": అమిత్ షా

Published : May 11, 2022, 06:21 AM IST
Amit Shah: "అస్సాంలో ఆ చట్టాన్ని పూర్తిగా తొల‌గిస్తాం": అమిత్ షా

సారాంశం

Amit Shah: సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (AFSPA)ను అసోంలో త్వరలోనే పూర్తిగా ఎత్తివేయనున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా తెలిపారు. కేంద్రం, అసోం సీఎం హిమంత బిస్వాశర్మ ప్రయత్నాల వల్ల తీవ్రవాద సంస్థలు చాలావరకు శాంతి ఒప్పందం చేసుకున్నాయని తెలిపారు.    

Amit Shah: అస్సాంలో శాంతిభద్రతల సంస్కరణలు, ఉగ్ర సంస్థలతో శాంతి ఒప్పందాలను ఉటంకిస్తూ.. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (AFSPA) త్వరలో రాష్ట్రం నుండి పూర్తిగా ఎత్తివేయనున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. శాంతిభద్రతలు మెరుగుపడటంతో కేంద్ర ప్రభుత్వం గతంలో ఏఎఫ్‌ఎస్‌పీఏ కింద అస్తవ్యస్తంగా ఉన్న ప్రాంతాలను క్రమంగా తగ్గించడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. కేంద్ర హోంమంత్రి రెండు రోజుల అసోంలో పర్యటించారు.

మంగళవారం అస్సాం పోలీసులకు 'ప్రెసిడెంట్స్ కలర్' (ప్రెసిడెంట్ జెండా) ప్రదానం చేసిన అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. కేంద్రం, అసోం సీఎం హిమంత బిస్వాశర్మ ప్రయత్నాల వల్ల తీవ్రవాద సంస్థలు చాలావరకు శాంతి ఒప్పందం చేసుకున్నాయని తెలిపారు. తీవ్రవాదం, హింస నుంచి అసోంకు పూర్తిగా విముక్తి లభించే రోజు ఎంతో దూరం లేదని అమిత్‌ షా ఆశాభావం వ్యక్తం చేశారు.

సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని 23 జిల్లాల్లో పూర్తిగా, ఒక జిల్లా నుంచి పాక్షికంగా తొలగించినట్లు చెప్పారు. ఇది త్వరలో రాష్ట్రం మొత్తం నుండి తీసివేయబడుతుందని  ఖచ్చితంగా అనుకుంటున్నాను. అసోంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ఇప్పటివరకు 9,000 మంది ఉగ్రవాదులు లొంగిపోయారని అమిత్ షా చెప్పారు.

పునరావాసం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి  

లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి వచ్చిన వారి పునరావాసం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని హోంమంత్రి తెలిపారు. అసోం పోలీసులకు గర్వకారణమైన చరిత్ర ఉందని షా అన్నారు. ఇది తీవ్రవాదం, సరిహద్దు సమస్యలు, ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, పశువుల అక్రమ రవాణా, ఖడ్గమృగం,  మంత్రవిద్య వంటి సామాజిక సమస్యలను పరిష్కరించడంలో విజయం సాధించిందని, ఇప్పుడు దేశంలోని ప్రముఖ పోలీసు దళాలలో ఒకటిగా ఎదుగుతోంది. దానికి 'ప్రెసిడెంట్స్ కలర్' సరిగ్గానే అర్హుడని అన్నాడు.

అసోంలో పశువుల స్మగ్లర్లపై రాష్ట్ర ప్రభుత్వ చర్యలు కొనసాగుతాయని, గత ఏడాది కాలంలో ఇప్పటివరకు 992 మందిని అరెస్టు చేశామని, సుమారు పది వేల పశువులను రక్షించామని అమిత్​ షా తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 10,700 బిగాస్ (ఎకరంలో మూడోవంతు) భూమిని ఆక్రమణదారుల నుంచి విముక్తి చేసినట్లు షా పేర్కొన్నారు.

అంతకుముందు ఇక్కడ జరిగిన అలంకార కవాతు వేడుకలో ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ భాస్కర్ జ్యోతి మహంత సమక్షంలో అమిత్ షా రాష్ట్ర పోలీసుల గౌర‌వ వంద‌నాన్ని స్వీక‌రించారు. 
 

PREV
click me!

Recommended Stories

దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు | Best Prime Minister of India | Best CM
ట్రైన్ లో వాటర్ ఎలా సప్లై అవుతుంది? నీళ్లు ఎక్కడ స్టోర్ చేస్తారు? | Railway Quick Watering System