మౌని అమావాస్య తొక్కిసలాటతో అలర్ట్... వసంత పంచమికి సీఎం యోగి కీలక ఆదేశాలు

మౌని అమావాస్య ఘటన తర్వాత మహా కుంభమేళాలో చివరి అమృత స్నానం కోసం భద్రతను పెంచారు. ముఖ్యమంత్రి యోగీ అధికారులకు, ప్రజల నియంత్రణ, రవాణా మరియు భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

CM Yogi strengthens security for Basant Panchami Amrit Snan at Prayagraj Kumbh Mela 2025 AKP

మహా కుంభ నగర్ : మౌని అమావాస్య పుణ్యస్నానం సందర్భంగా మహా కుంభమేళాలో పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటన తర్వాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి అమృత స్నానం కోసం భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. ఫిబ్రవరి 3న జరగనున్న వసంత పంచమి అమృత స్నానం ఏర్పాట్లను సమీక్షించాలని ముఖ్యమంత్రి యోగీ, ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్, డీజీపీ ప్రశాంత్ కుమార్‌లకు ఆదేశించారు.

సీఎం యోగీ అధికారులతో అత్యవసర సమావేశం

కుంభమేళాలో ప్రజల నియంత్రణ, రవాణా నిర్వహణ, భద్రతపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి యోగి.  ప్రజల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఆ తర్వాత ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్, ప్రశాంత్ కుమార్ గురువారం మహా కుంభమేళా ప్రాంతానికి చేరుకున్నారు. స్నాన ప్రాంతంలో ప్రజల రద్దీ పెరగకుండా ఉండేందుకు ప్రయాగ్‌రాజ్‌లోని అన్ని సరిహద్దు ప్రాంతాల్లో తాత్కాలిక విడిది కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతరాయం లేకుండా బయటకు వెళ్లే అన్ని మార్గాలను తెరిచి ఉంచాలని, రైల్వే, రవాణా సంస్థ అదనపు రైళ్లు, బస్సులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

Latest Videos

 ఈ ప్రమాదం తర్వాత ముఖ్యమంత్రి సీనియర్ IAS అధికారులు డాక్టర్ ఆశీష్ గోయల్, భానుచంద్ర గోస్వామిలను ప్రయాగ్‌రాజ్‌కు పంపారు.  ఇంతకు ముందు 2019లో జరిగిన కుంభమేళాను ఈ ఇద్దరు అధికారులే విజయవంతంగా నిర్వహించారు. అప్పట్లో మండల కమిషనర్‌గా ఆశీష్ గోయల్, ప్రయాగ్‌రాజ్ జిల్లా మేజిస్ట్రేట్‌గా భానుచంద్ర గోస్వామి మధ్య మంచి సమన్వయం ఉంది.  2019 అర్ధ కుంభమేళాను ఈ ఇద్దరు అధికారులు విజయవంతంగా నిర్వహించారు. ఈ ఇద్దరు అధికారులతో పాటు 5 మంది ప్రత్యేక కార్యదర్శి స్థాయి అధికారులు ఫిబ్రవరి 15 వరకు ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు.

వీరితో పాటు ముగ్గురు PCS అధికారులు ప్రఫుల్ త్రిపాఠి, ప్రతిపాల్ సింగ్ చౌహాన్, ఆశుతోష్ దూబేలను కూడా ఫిబ్రవరి 15 వరకు కుంభమేళాలో విధుల్లో నియమించారు.  ప్రయాగ్‌రాజ్‌లో SP స్థాయి అధికారులు ప్రజల నియంత్రణ బాధ్యతలు నిర్వహిస్తారు. అయోధ్య, వారణాసి, చిత్రకూట్, మీర్జాపూర్‌లలో కూడా భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.

సీఎం యోగీ 6 కీలక ఆదేశాలు

 1. స్నాన ఘాట్‌ల వద్ద బారికేడ్లను బలపర్చాలి.

2. గందరగోళం లేకుండా ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేయాలి.

3. ఆహారం, తాగునీటి ఏర్పాట్లు సరిగ్గా ఉండాలి.

4. భక్తులు ఎలాంటి ఆటటంకాలు లేకుండా స్నానం, దర్శనం చేసుకునేలా చూడాలి.

5. అన్ని కీలక మార్గాల్లో భద్రతా బలగాల గస్తీని పెంచాలి.

6. ప్రయాగ్‌రాజ్, పరిసర ప్రాంతాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలి.

 

vuukle one pixel image
click me!
vuukle one pixel image vuukle one pixel image