అస్సాంలో ఉల్ఫా-ఐ ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు.. పౌరుడికి గాయాలు

Published : Dec 21, 2022, 02:33 PM IST
అస్సాంలో ఉల్ఫా-ఐ ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు.. పౌరుడికి గాయాలు

సారాంశం

అస్సాం రాష్ట్రంలోని తిన్‌సుకియా జిల్లాలో భద్రతా బలగాలు, ఉల్ఫా-ఐ ఉగ్రవాదులకు మధ్య బుధవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ పౌరుడికి గాయాలు అయ్యాయి. 

అస్సాంలో ఎన్ కౌంటర్ జరిగింది. తిన్‌సుకియా జిల్లాలో బుధవారం ఉదయం భద్రతా బలగాలు, ఉల్ఫా-ఐతో సంబంధం ఉన్నఅనుమానిత ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. అయితే ఆల్ఫా-ఐ మిలిటెంట్లు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ఓ పౌరుడికి గాయాలు అయ్యాయి.

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు అల్ ఖైదాతో లింకులు - ఎన్ఐఏ

దీంతో ఆ ప్రాంతాన్ని మొత్తం భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఈ ఎన్ కౌంటర్ ను గౌహతి డిఫెన్స్ పీఆర్వో ధృవీకరించారని వార్తా సంస్థ ఏఎన్ఐ నివేదించింది. ఎగువ అస్సాం జిల్లాలోని పెంగేరి-దిగ్‌బోయ్ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది... 

PREV
click me!

Recommended Stories

ఇక ప‌ని అయిపోంది అనుకున్న స‌మ‌యంలో పీకే వండ‌ర్‌.. ప్ర‌శాంత్ కిశోర్ గెలుపు అస‌లు కార‌ణ‌లేంటి?
బీహార్‍లో బీజేపీకి షాక్.. కమలం ఓడిపోవడానికి కారణమిదే | Prashant Kishor | Bihar By Election Result