అస్సాంలో ఉల్ఫా-ఐ ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు.. పౌరుడికి గాయాలు

Published : Dec 21, 2022, 02:33 PM IST
అస్సాంలో ఉల్ఫా-ఐ ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు.. పౌరుడికి గాయాలు

సారాంశం

అస్సాం రాష్ట్రంలోని తిన్‌సుకియా జిల్లాలో భద్రతా బలగాలు, ఉల్ఫా-ఐ ఉగ్రవాదులకు మధ్య బుధవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ పౌరుడికి గాయాలు అయ్యాయి. 

అస్సాంలో ఎన్ కౌంటర్ జరిగింది. తిన్‌సుకియా జిల్లాలో బుధవారం ఉదయం భద్రతా బలగాలు, ఉల్ఫా-ఐతో సంబంధం ఉన్నఅనుమానిత ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. అయితే ఆల్ఫా-ఐ మిలిటెంట్లు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ఓ పౌరుడికి గాయాలు అయ్యాయి.

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు అల్ ఖైదాతో లింకులు - ఎన్ఐఏ

దీంతో ఆ ప్రాంతాన్ని మొత్తం భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఈ ఎన్ కౌంటర్ ను గౌహతి డిఫెన్స్ పీఆర్వో ధృవీకరించారని వార్తా సంస్థ ఏఎన్ఐ నివేదించింది. ఎగువ అస్సాం జిల్లాలోని పెంగేరి-దిగ్‌బోయ్ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది... 

PREV
click me!

Recommended Stories

Viral News: చెత్త కుప్ప‌లో చాక్లెట్లు, ఒక్క‌సారిగా ఎగ‌బ‌డ్డ జ‌నం.. అస‌లు విష‌యం తెలిస్తే
Who is Best PM of India: దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు.. సీజేపీ బాస్ హాట్ కామెంట్స్