సిగరెట్ షేరింగ్ విషయంలో గొడవ... ఒకరి హత్య, ఇద్దరికి గాయాలు...

Published : Mar 25, 2023, 11:55 AM IST
సిగరెట్ షేరింగ్ విషయంలో గొడవ... ఒకరి హత్య, ఇద్దరికి గాయాలు...

సారాంశం

బుధవారం రాత్రి మల్లినాథ, గణేష్‌ల మధ్య సిగరెట్‌ తాగే విషయంలో గొడవ జరిగి గణేష్‌పై దాడికి పాల్పడ్డాడు.

కర్ణాటక : గురువారం బెంగళూరులోని ఉప్పర్‌పేటలో సిగరెట్ షేరింగ్ విషయంలో మొదలైన గొడవ ఒక వ్యక్తి హత్యకు దారితీయగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతుడు కలబుర్గి జిల్లాకు చెందిన మల్లినాథ బిరాదార్ (36)గా గుర్తించారు. అతను గత కొన్ని నెలలుగా మెజెస్టిక్ సమీపంలోని ఒక హోటల్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. బాధితుడి సహోద్యోగి గణేష్ అనే వ్యక్తి ఈ కేసులో ప్రధాన నిందితుడని పోలీసులు తెలిపారు.

బుధవారం రాత్రి మల్లినాథ, గణేష్‌ల మధ్య సిగరెట్‌ తాగే విషయంలో గొడవ జరిగింది. దీంతో మల్లినాథుడు గణేష్‌పై దాడి చేశాడు. అయితే ఆ సమయంలో అక్కడే ఉణ్న మంజునాథ్ అనే మరో సహోద్యోగి కలిగించుకుని గొడవను సద్దుమణిగేలా చేశాడని పోలీసులు తెలిపారు.

దౌత్యవేత్తలకు భద్రత కల్పించాల్సిన బాధ్యతను బ్రిటన్ నెరవేర్చడం లేదు - విదేశాంగ మంత్రి జైశంకర్

మరుసటి రోజు సాయంత్రం 6:30 గంటల సమయంలో, గణేష్ మళ్లీ సమస్యను లేవనెత్తాడని, ఇది ముగ్గురి మధ్య మరోసారి గొడవకు దారితీసిందని చెబుతున్నారు. తనతో పాటు కత్తితో తెచ్చుకున్న గణేష్.. ఈ గొడవలో మల్లినాథం కడుపులో పొడిచాడు. ఈ ఘర్షణలో గణేష్, మంజునాథ్‌లకు కూడా గాయాలయ్యాయి.

మల్లినాథను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా, అతను అప్పటికే  చనిపోయినట్లు నిర్ధారించారు. క్షతగాత్రులను విక్టోరియా ఆస్పత్రిలో చేర్పించారు. ఉప్పరపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Delhi Accident : ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్ భవనం... శిథిలాల కింద 50 మంది విద్యార్థులు ఉన్నారా?
నేపాల్ భయానక దృశ్యాలు | Nepal Visuals | Asianet News Telugu