అయోధ్య కేసు:' అక్టోబర్ 18 నాటికి వాదనలు పూర్తి కావాల్సిందే'

Published : Sep 26, 2019, 01:49 PM IST
అయోధ్య కేసు:' అక్టోబర్ 18 నాటికి వాదనలు పూర్తి కావాల్సిందే'

సారాంశం

అయోధ్య కేసులో వాదనలను త్వరగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఇరు పక్షాల న్యాయవాదులను కోరింది. 

న్యూఢిల్లీ: అయోధ్య కేసులో ఇరుపక్షాల వాదనలను ఈ ఏడాది అక్టోబర్ 18వ తేదీ నాటికి పూర్తి చేయాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ స్పష్టం చేశారు.అయోధ్య భూ వివాదం కేసు విషయమై గురువారం నాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్  ఈ మేరకు ఇరు పక్షాల న్యాయవాదులకు సూచించారు.

ఈ ఏడాది నవంబర్ మాసంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పదవి కాలం ముగియనుంది. అయితే తన పదవీకాలం ముగిసేలోపుగానే ఈ కేసుపై తీర్పు వెలువడితే నాలుగు వారాల్లో ఈ కేసుకు సంబంధించిన నిర్ణయం వెలువరించి రికార్డు  సృష్టించనుంది.

అక్టోబర్ 18వ తేదీ నాటికి ఇరు పక్షాల వాదనలు  పూర్తి చేయాలంటే దీపావళి సెలవుల్లో కూడ కోర్టు వాదనలను వినే అవకాశం లేకపోలేదు.శనివారాల్లో ఎక్కువ సమయం ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు పనిచేస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం ఇరుపక్షాల వాదనలను వింటుంది.

PREV
click me!

Recommended Stories

ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఇంట్లో గోనె సంచుల్లో కోట్ల రూపాయల నోట్ల కట్టలు, కేజీల కొద్దీ బంగారం
Sri Sathya Sai University: దేశంలోనే తొలిసారి 138 మంది రైతులకు ‘కృషి - ఋషి’ పట్టాలు.. హిస్టరీ క్రియేట్ శ్రీ సత్యసాయి యూనివర్శిటీ