చత్తీస్‌గడ్ సీఎం భుపేశ్ బఘేల్ తండ్రి అరెస్టు.. 15 రోజుల కస్టడీకి తరలింపు

Published : Sep 07, 2021, 04:41 PM ISTUpdated : Sep 07, 2021, 04:55 PM IST
చత్తీస్‌గడ్ సీఎం భుపేశ్ బఘేల్ తండ్రి అరెస్టు.. 15 రోజుల కస్టడీకి తరలింపు

సారాంశం

చత్తీస్‌గడ్ సీఎం భుపేశ్ బఘేల్ తండ్రి నంద్‌కుమార్ బఘేల్‌ను రాయ్‌పూర్ పోలీసులు అరెస్టు చేశారు. బ్రాహ్మణులపై ఆయన చేసిన వ్యాఖ్యలకుగాను కేసు నమోదైంది. ఈ కేసులో నంద్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనను 15 రోజుల కస్టడీకి పంపింది.

రాయ్‌పూర్: చత్తీస్‌గడ్ ముఖ్యమంత్రి భుపేశ్ బఘేల్ తండ్రి నంద్‌కుమార్ బఘేల్‌ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బ్రాహ్మణులపై ఆయన చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకుగాను డీడీ నగర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. రాయ్‌పూర్ పోలీసులు తాజాగా నంద్‌కుమార్ బఘేల్‌ను అరెస్టు చేశారు. ఈ కేసుపై విచారణ జరుగుతున్న న్యాయస్థానంలో ఆయనను హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనను 15 రోజుల కస్టడీకి పంపింది.

బ్రాహ్మణులు విదేశీయులని నంద్‌కుమార్ బఘేల్ ఇటీవలే ఓ ప్రసంగంలో పేర్కొన్నారు. వారు స్వయంగా సంస్కరించుకోవాలని, లేదంటే వారిని గంగా నది నుంచి వోల్గా నదికి పంపాలని అన్నారు. ఈ వ్యాఖ్యలపై డీడీ నగర్ పోలీసు స్టేషన్‌లో బ్రాహ్మణ వర్గానికి చెందిన ఓ సంఘం ఫిర్యాదు చేసింది. సమాజంలో విద్వేషాన్ని రగిల్చేలా ఆయన వ్యాఖ్యలున్నాయని, శాంతి సామరస్యాలకు భంగం కలిగిస్తున్నాయని పేర్కొంది. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసుపై సీఎం భుపేశ్ కుమార్ బఘేల్ స్పందించారు. ‘ఒక కుమారుడిగా నేను నా తండ్రిని గౌరవిస్తాను. కానీ, శాంతి భద్రతలకు భంగం కలిగించేలా మాట్లాడితే ఒక సీఎంగా ఉపేక్షించను. చట్టానికి ఎవరూ అతీతులు కాదు’ అని స్పష్టం చేశారు.

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu