ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు.. ఓబీసీ ఓట‌ర్లు టార్గెట్ గా బీజేపీ వ్యూహాలు

Published : Aug 11, 2022, 02:08 PM ISTUpdated : Aug 11, 2022, 02:21 PM IST
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు.. ఓబీసీ  ఓట‌ర్లు టార్గెట్ గా బీజేపీ వ్యూహాలు

సారాంశం

Chhattisgarh BJP: ఇప్పటివరకు లేని ఓబీసీ నేతలను అభివృద్ధి చేయాలని పార్టీ నాయకత్వం కోరుకుంటోందని బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. రానున్న ఎన్నిక‌ల్లో వీరిపాత్ర కీల‌కంగా ఉండ‌నుంది. ఎందుకంటే ఛత్తీస్‌గఢ్‌లో 2.5కోట్లకు పైగా జనాభాలో 45% మంది OBCలు ఉన్నారు.   

Chhattisgarh assembly elections: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఓట‌ర్ల‌ను త‌మ‌వైపు తిప్పుకునేందుకు ప‌క్కా వ్యూహాల‌తో ముందుకు సాగుతోంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఒక సంవత్సరం మాత్రమే సమయం ఉంది. దీంతో ఛత్తీస్‌గఢ్ బీజేపీ నాయ‌క‌త్వం రాష్ట్రంలోని ఓబీసీ కమ్యూనిటీపై దృష్టి సారిస్తోంది. ఈ క్ర‌మంలోనే  విన్షు దేవ్ సాయి స్థానంలో పార్లమెంటు సభ్యుడు అరుణ్ సావోను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. రాష్ట్రంలో త్వ‌ర‌లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓబీసీ ఓట‌ర్లు కీల‌కంగా ఉండున్నారు. భార‌తీయ జ‌నతా పార్టీ వారిని ఆక‌ర్షించే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఛత్తీస్‌గఢ్‌లో 45% జనాభా ఉన్న ఓబీసీల పట్ల బీజేపీ అప్రమత్తంగా ఉందని, అధికారంలో ఉన్న సమయంలో ప్రాంతీయ, ఓబీసీ కార్డులపై పట్టుసాధించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ వెనుకంజ వేస్తున్నారని పార్టీ నేతలు తెలిపారు.

ఇప్పటి వరకు లేని ఓబీసీ నాయకులను అభివృద్ధి చేయాలని పార్టీ నాయకత్వం కోరుకుంటోందని బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. పార్టీలో సాధారణంగా రెండు ప్రధాన వర్గాలు ఉన్నాయి. ఒకటి రమణ్ సింగ్, ఠాకూర్, మరొకటి మాజీ వ్యవసాయ మంత్రి బ్రిజ్మోహన్ అగర్వాల్ నేతృత్వంలోనివి. “రాబోయే రెండు నెలల్లో మరిన్ని మార్పులను మేము ఆశిస్తున్నాము. ఛత్తీస్‌గఢ్‌లో పార్టీకి బలమైన ఓబీసీ నేతలు అవసరమని సీనియర్ నేతలు నమ్ముతున్నారు. చాలా మంది OBC నాయకులు ఇతర ప్రభావవంతమైన అగ్రవర్ణ నాయకులచే మార్గనిర్దేశం చేయబడతారు. కాబట్టి పార్టీకి బలమైన ముఖం అవసరం అని న‌మ్ముతున్నామ‌ని బీజేపీ వ‌ర్గాలు పేర్కొన్నాయి.రెండవది, OBC నాయకులు ఇత‌ర వర్గాలలో చిక్కుకున్నారు.. అందువల్ల వారు ప్రభావం చూపడం లేదు”అని బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు. సావో మాట్లాడుతూ, మొదటిసారి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పటికీ విశ్వసనీయమైన సంస్థ మనిషి అని, ఏ వర్గానికి పొత్తుగా కనిపించడం లేదన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో 2.5 కోట్ల జనాభాలో 45% మంది OBCలు ఉన్నారు. గిరిజనులు 33శాతం, షెడ్యూల్డ్ కులాలు 13 శాతం మంది ఉన్నారు.

2000 సంవత్సరంలో రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి, ఛత్తీస్‌గఢ్‌లో పార్టీని నడిపించడానికి బీజేపీ ఎక్కువగా గిరిజన ముఖాలపై విశ్వాసం ఉంచింది. మునుపటి అధ్యక్షుల్లో నందకుమార్ సాయి, రామ్‌సేవక్ పైక్రా, విక్రమ్ ఉసెండి, విష్ణుదేయో సాయి వంటి గిరిజన నాయకులు ఉన్నారు. OBC నాయకులలో పార్టీ సీనియర్ స్థానాల్లో ఉంచారు.  ప్రతిపక్ష నాయకుడు ధరమ్‌లాల్ కౌశిక్, దివంగత తారాచంద్ సాహు (మాజీ ఎంపీ) పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నియామకం ద్వారా ఆదివాసీ ఓటర్లను బీజేపీని ఆద‌రిస్తార‌ని కొందరు నేతలు భావిస్తున్నారు.

“భారత రాష్ట్రపతిగా ఒక గిరిజనుడిని నియమించడం ద్వారా రాష్ట్రంలోని గిరిజన ఓటర్లను లక్ష్యంగా చేసుకున్న తర్వాత, మా పార్టీ ఇప్పుడు OBC ఓటర్లపై దృష్టి పెట్టాలని విశ్వసిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌కు సమాంతరంగా మరో ఫ్రంట్‌ను ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆ పార్టీలోని ఓ వర్గం నేతలు భావిస్తున్నారు. గిరిజన బీజేపీ అధ్యక్షుడిని ఓబీసీతో మార్చడం గిరిజన నాయకులు-ఇతరుల మధ్య చీలికను సృష్టించవచ్చు. అయితే, అలాంటి ప‌రిస్థితులు రాకుండా పార్టీ నాయ‌క‌త్వం కూడా కసరత్తు చేస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో OBC ఓటర్లు త‌మ‌కు తిరిగి ఓటు వేస్తారని తాము నమ్ముతున్నామని మ‌రో బీజేపీ నాయ‌కుడు పేర్కొన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu