ఆంధ్ర క్లబ్ మెంబర్ పై గ్యాంగ్ స్టర్ దాడి.. వీడియో వైరల్

By telugu teamFirst Published Jul 22, 2019, 9:50 AM IST
Highlights

శ్రీధర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఓ వ్యాపారవేత్త. కాగా.. ఆంధ్ర క్లబ్ ఎన్నికల్లో పోటీకి నిలబడ్డాడు. అయితే.. గత వారం ఆయన క్లబ్ నుంచి ఇంటికి వెళ్తుండగా... దుండగులు అడ్డగించి మరీ అతి దారుణంగా కొట్టారు. ఆ దాడిలో తీవ్రగాయాలపాలైన శ్రీధర్ రెడ్డి కిందపడిపోగా.. ఆ దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.


చెన్నైలోని ఆంధ్రక్లబ్ మెంబర్ పై ఇటీవల ఓ గ్యాంగ్ స్టర్ దాడి చేశాడు. కాగా... ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత వారం టీ నగర్ లోని ఆంధ్ర క్లబ్ లో ఎన్నికలు నిర్వహించగా... ఈ విషయంలో పెద్ద వివాదం చోటుచేసుకుంది. ఓ గ్యాంగ్ స్టర్ తన మనుషులతో కలిసి ఆంధ్రక్లబ్ మెంబర్ శ్రీధర్ రెడ్డిపై దాడిచేశాడు. క్రికెట్ బ్యాట్ తో అతి దారుణంగా కొట్టాడు. ఈ ఘటన మొత్తం సమీపంలోని ఓ సీసీ కెమేరాలో రికార్డు అయ్యింది.

శ్రీధర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఓ వ్యాపారవేత్త. కాగా.. ఆంధ్ర క్లబ్ ఎన్నికల్లో పోటీకి నిలబడ్డాడు. అయితే.. గత వారం ఆయన క్లబ్ నుంచి ఇంటికి వెళ్తుండగా... దుండగులు అడ్డగించి మరీ అతి దారుణంగా కొట్టారు. ఆ దాడిలో తీవ్రగాయాలపాలైన శ్రీధర్ రెడ్డి కిందపడిపోగా.. ఆ దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ సమయంలో.. అక్కడి నుంచి ఓ వ్యక్తి వెళ్లినా... గాయాలపాలైన శ్రీధర్ రెడ్డిని కాపాడటానికి ముందుకు రాకపోవడం గమనార్హం. 

బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే... ఆంధ్రక్లబ్ విషయంలో శ్రీధర్ రెడ్డికి, ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వాధికారి జనార్థన్ రెడ్డికి పాతకక్షలు ఉన్నాయి. శ్రీధర్ రెడ్డిని క్లబ్ నుంచి బయటకు పంపించాలని జనార్థన్ రెడ్డి చాలా సార్లు ప్రయత్నించారు. అయినా.. సక్సెస్ కాలేకపోయారు. ఈ నేపథ్యంలో పాతకక్షలను మనసులో పెట్టుకొని జనార్థన్ ఈ దాడి చేయించి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. సీసీ కెమేరాలో రికార్డు అయిన వీడియో ఆధారంగా పోలీసులు తమ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

click me!