కర్ణాటక సంక్షోభం: సుప్రీంలో స్వతంత్ర ఎమ్మెల్యేల పిటిషన్

Siva Kodati |  
Published : Jul 22, 2019, 09:21 AM IST
కర్ణాటక సంక్షోభం: సుప్రీంలో స్వతంత్ర ఎమ్మెల్యేల పిటిషన్

సారాంశం

ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు శంకర్, నగేశ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సోమవారం సాయంత్రం 5 గంటల లోపు బలపరీక్ష ముగిసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌‌లో పేర్కొన్నారు.

కర్ణాటక రాజకీయాం నేడు తుది అంకానికి చేరుకుంది. సోమవారం బలపరీక్ష జరగనుండటంతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్-జేడీఎస్, అధికారాన్ని దక్కించుకునేందుకు బీజేపీ వ్యూహా ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి.

ఇప్పటికే విశ్వాసపరీక్ష ఆలస్యమవుతుండటంతో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు శంకర్, నగేశ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సోమవారం సాయంత్రం 5 గంటల లోపు బలపరీక్ష ముగిసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌‌లో పేర్కొన్నారు.

మరోవైపు ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కుమారస్వామి చివరి ప్రయత్నాలకు దిగారు. ఈ సందర్భంగా జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేలకు ఆయన లేఖ రాశారు. బీజేపీ ఉచ్చులో పడొద్దని .. సమస్యలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకుందామని లేఖలో పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Slowest Train: కదిలే స్వర్గం ఊటీ టాయ్ ట్రైన్.. సైకిల్ వేగంతో వెళ్లే ఈ రైలు ప్రయాణానికి ఎందుకంత క్రేజ్?
అజిత్ ని పరామర్శించిన సీఎం విజయ్, త్రిష | Ajith Kumar Mother Demise | Asianet News Telugu