వీడిన ఉత్కంఠ.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండా ఇదే.. 

Published : Sep 13, 2023, 10:58 PM IST
వీడిన ఉత్కంఠ.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండా ఇదే.. 

సారాంశం

Parliament Special Sessions: సెప్టెంబర్ 18న పాత భవనంలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే సమయంలో సెప్టెంబర్ 19 నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో పార్లమెంట్ కార్యకలాపాలు జరగనున్నాయి. ఈ సమావేశాల సంబంధించిన ఎజెండాను ప్రభుత్వం విడుదల చేసింది.       

Parliament Special Sessions: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై ఉత్కంఠ వీడింది. ప్రభుత్వం ఎట్టకేలకు ఎజెండాను విడుదల చేసింది. ఇందులో భాగంగా తొలి రోజు “సంవిధాన్ సభ” నుంచి 75 ఏళ్ల పార్లమెంట్ ప్రస్థానంపై చర్చ సాగించనున్నట్టు పార్లమెంట్ బులెటిన్‌ విడుదల చేసింది.

పార్లమెంటరీ బులెటిన్ ప్రకారం.. జాబితా చేయబడిన బిల్లులలో  1)న్యాయవాదుల (సవరణ) బిల్లు 2023, 2) ప్రెస్ అండ్  పీరియాడికల్ రిజిస్ట్రేషన్ బిల్లు 2023, 3) పోస్టాఫీసు బిల్లు 2023, 4) ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్‌లతో పాటు (సేవా మరియు పదవీకాల నియామక నిబంధనలు) ) బిల్లు ప్రవేశపెట్టనున్నట్టు లోక్‌సభ తన బులెటిన్‌లో పేర్కొంది. ఆగస్టు 10న వర్షాకాల సమావేశాల సందర్భంగా ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
 
నిజానికి సెప్టెంబర్ 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబరు 18 నుంచి 22 వరకు జరిగే ఈ సెషన్‌లో మొదటి రోజు మినహా మిగిలిన కార్యక్రమాలు కొత్త పార్లమెంటు భవనంలో జరగనున్నాయి. గణేష్ చతుర్థి రోజున కొత్త భవనంలో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఇదిలావుండగా, ప్రత్యేక సమావేశానికి ఒక రోజు ముందు సెప్టెంబర్ 17న ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని పిలిచింది.

ఎలాంటి సన్నాహాలు చేస్తున్నారంటే?

లోక్‌సభ సెక్రటేరియట్ బులెటిన్ ప్రకారం.. 17వ లోక్‌సభ 13వ పార్లమెంట్ సమావేశాలు సెప్టెంబర్ 18, 2023 సోమవారం ప్రారంభమవుతాయి. అదే సమయంలో రాజ్యసభ 261వ సమావేశాలు కూడా సెప్టెంబర్ 18 సోమవారం నుండి ప్రారంభమవుతాయని రాజ్యసభ సెక్రటేరియట్ తెలిపింది. ఉభయ సభల ఈ సెషన్ ప్రశ్నోత్తరాల సమయం లేదా ప్రైవేట్ సభ్యుల పని లేకుండానే నిర్వహించబడుతుంది.

సెప్టెంబర్ 18న పాత భవనంలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే సమయంలో సెప్టెంబర్ 19 నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో పార్లమెంట్ కార్యకలాపాలు జరగనున్నాయి. సెప్టెంబరు 19న కొత్త పార్లమెంట్ హౌస్‌లో కార్యకలాపాలు ప్రారంభమయ్యే ముందు ప్రత్యేక పూజలు కూడా ఉంటాయి. కొత్త పార్లమెంట్ భవనాన్ని ఈ ఏడాది మే 28న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

అంతకుమందు సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో దేశ ఆర్థిక పరిస్థితి, కుల గణన, చైనా, అదానీ గ్రూపుతో సరిహద్దులో ప్రతిష్టంభనపై చర్చించాలని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. 

PREV
click me!

Recommended Stories

అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial
Fact: ఆ గ్రామంలో ఏ ఇంటికి తాళం వేయరు, అసలు తలుపులే ఉండవు.. ఏంటా గ్రామం, దాని కథేంటి.?