Election Commission: రాజకీయ పార్టీలకు ఎలక్షన్ కమిషన్ వార్నింగ్..

By Rajesh KarampooriFirst Published Feb 5, 2024, 10:59 PM IST
Highlights

Election Commission: దేశంలో త్వరలో సార్వత్రిక లోక్‌సభ ఎన్నికలు (Parliament Elections 2024) నగరా మోగనున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రచారానికి సంబంధించి కీలక మార్గదర్శకాలను  జారీ చేసింది. పరోక్షంగా రాజకీయ పార్టీలను హెచ్చరించింది. ఎన్నికల ప్రచారంలో చిన్న పిల్లలను ఎట్టి పరిస్తితుల్లోనూ ఉపయోగించరాదని ఆదేశించింది.
 

Election Commission: దేశంలో త్వరలో సార్వత్రిక లోక్‌సభ ఎన్నికలు (Parliament Elections 2024) నగరా మోగనున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల సంఘం కీలక మార్గదర్శకాలను  జారీ చేసింది. కమిషన్ జారీ చేసిన కొత్త ఉత్తర్వు ప్రకారం.. అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రచారం, ర్యాలీలలో పిల్లలను ఉపయోగించడాన్ని నిషేధించాలని కోరింది. 

లోక్‌సభ ఎన్నికలకు ముందు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) రాజకీయ పార్టీలకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎలాంటి ఎన్నికల ప్రచారాలు, ర్యాలీల్లో పిల్లలను ఉపయోగించకుండా చూడాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కమీషన్ జారీ చేసిన ఆదేశంలో అన్ని రాజకీయ పార్టీలు పిల్లలను ఏ ఎన్నికలలో పాల్గొనవద్దని కోరింది. ఎన్నికల ప్రచార సమయంలో పిల్లలను ఏ విధంగానూ ఉపయోగించకూడదని ఆదేశించింది. 

Latest Videos

పిల్లలను ర్యాలీలు, నినాదాలు, పోస్టర్లు పంపిణీ చేయడం వంటి ప్రచారాలకు పిల్లలను దూరంగా ఉంచాలని సూచించింది. ఇది కాకుండా.. ఎన్నికల ప్రచారం లేదా ర్యాలీల సమయంలో రాజకీయ నాయకులు, అభ్యర్థులు తమ వాహనంలో పిల్లలను పట్టుకోవడం లేదా తీసుకెళ్లడం కూడా అనుమతించబడదు. పిల్లలను ఇతర మార్గాల్లో ఉపయోగించడాన్ని కూడా ఎన్నికల సంఘం నిషేధించింది.

ఎన్నికల సంఘం ప్రకారం, పిల్లలు ఏ విధంగానైనా రాజకీయ ప్రచారంలో పాల్గొనడం, లేదా పిల్లలచే ప్రసంగాలు చెప్పించడం, ఏదైనా పార్టీ గురించి వారితో మాట్లాడించటం లేదా ఏదైనా రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి చిహ్నాన్ని ప్రదర్శించడం వంటివి నిషేధించబడ్డాయి. అయితే పిల్లలు వారి తల్లిదండ్రుల సమక్షంలో ఏదైనా రాజకీయ నేత, అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే మాత్రం తమ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు కాదని స్పష్టం చేసింది. పార్లమెంట్‌ ఎన్నికల దృష్ట్యా అన్ని రాజకీయ పార్టీలు ఈసీ మార్గదర్శకాలను పాట్టించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

గతేడాది కూడా ఎన్నికల సంఘం ఇలాంటి ఉత్తర్వులు జారీ చేసింది. అయితే  అప్పట్లో ఎన్నికల అధికారులనూ హెచ్చరించింది.  ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు , ఇతర సామాగ్రిని తీసుకెళ్లడానికి  కొన్ని చోట్ల పిల్లలను ఉపయోగించుకుంటున్నారని, ఇలా చేస్తే  జిల్లా ఎన్నికల అధికారులు వ్యక్తిగతంగా బాధత్య  వహించాల్సి ఉంటుందని పేర్కొంది.  

చట్టం యొక్క పరిణామాలను ఎదుర్కోవడమే కాకుండా తీవ్రమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఎన్నికల సమయంలో కొన్నిచోట్ల బాలలను వాడుతున్న వీడియోలు, ఫోటోలు వెలువడ్డాయి.  జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఇటువంటి కార్యకలాపాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  అందుకే ఎన్నికల కమిషన్ ఈ సారి ముందస్తుగా పూర్తి స్థాయి ఉత్తర్వులు జారీ చేసినట్లుగా సమాచారం.  

click me!