
ఎన్నికల కమిషనర్లను నియమించే సెలక్షన్ కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మినహాయించే చట్టాన్ని తీసుకురావడానికి కేంద్రం సిద్ధమైంది. దీని కోసం కేంద్ర ప్రభుత్వం బిల్లును తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ఎన్నికల కమిషనర్ల ఎంపికను ప్రధాని, ప్రతిపక్ష నేత, ప్రధాని నామినేట్ చేసిన కేంద్ర మంత్రితో కూడిన ప్యానెల్ పర్యవేక్షిస్తుందని ప్రతిపాదిత బిల్లు పేర్కొంది.
మణిపూర్ లో మరో మహిళపై గ్యాంగ్ రేప్.. ఆలస్యంగా వెలుగులోకి..
ఎన్నికల కమిషనర్ల నియామకంలో ప్రధాని, ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాల్గొనాలని ఈ ఏడాది మార్చిలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన ఏకగ్రీవ తీర్పులో.. ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్రక్రియపై పార్లమెంటు చట్టం రూపొందించే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొంది.
ప్రకాశ్ రాజ్ వచ్చి, వెళ్లాడని.. కాలేజీని గోమూత్రంతో శుద్ధి చేసిన విద్యార్థులు.. వీడియోలు వైరల్
అయితే ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన ప్యానెల్ సలహాల ఆధారంగా ప్రధాన ఎన్నికల కమిషనర్లు, ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని రాష్ట్రపతి చేపట్టాలని రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తీర్పును తాజా బిల్లు బలహీనపర్చనుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, సర్వీసు నిబంధనలు, పదవీకాలం) బిల్లు-2023ను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ త్వరలోనే రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.
తీర్థం అనుకొని నాటు సారా తాగిన గుజరాత్ మంత్రి రాఘవ్ జీ పటేల్ .. వీడియో వైరల్..
కాగా.. ఈ బిల్లును కాంగ్రెస్ విమర్శించింది. ఇది ‘‘ముఖ్యమైన సంస్థలను నియంత్రించడానికి మరొక ప్రయత్నం’’ అని పేర్కొంది. ‘‘ప్రధాన ఎన్నికల కమిషనర్ని సిఫార్సు చేయడానికి ప్రధానమంత్రి సెలక్షన్ కమిటీ సభ్యునిగా సీజేఐ స్థానంలో ఒక కేంద్ర క్యాబినెట్ మంత్రిని నియమిస్తారు. ప్రతిపక్ష నాయకుడు సభ్యుడిగా కూడా సభ్యుడిగా ఉన్నప్పటికీ.. మెజారిటీ అధికార పార్టీకే ఉంటుంది. స్వతంత్రంగా ఉండాల్సిన సంస్థను నియంత్రించడానికి ఇది మరొక మార్గం’’ అని కాంగ్రెస్ ఎంపీ సుస్మితా దేవ్ అన్నారు.