సహచరులపై బీఎస్ఎఫ్ జవాన్ కాల్పులు: ఐదుగురు మృతి, మరొకరి పరిస్థితి విషమం

Published : Mar 06, 2022, 12:58 PM ISTUpdated : Mar 06, 2022, 01:13 PM IST
సహచరులపై బీఎస్ఎఫ్ జవాన్ కాల్పులు: ఐదుగురు మృతి, మరొకరి పరిస్థితి విషమం

సారాంశం

పంజాబ్ రాష్ట్రంలోని ఖాసా వద్ద బీఎస్ఎఫ్ క్యాంపులో జవాన్లపై తోటి జవాన్ కాల్పులకు దిగాడు.ఈ ఘటనలో ఐదుగురు మరణించాడు. కాల్పులకు దిగిన జవాన్ కూడా  ఈ ఘటనలో మరణించాడు.

అమృత్‌సర్: పంజాబ్ రాష్ట్రంలోని Amritsarసమీపంలో గల Khasa  గ్రామం వద్ద BSF క్యాంపులో  ఆదివారం నాడు తోటి Jawansపై సహచర జవాన్ కాల్పులకు దిగాడు.ఈ ఘటనలో Firingలోఐదుగురు మరణించారు.  అనంతరం కాల్పులు జరిపిన కానిస్టేబుల్ కూడా ఈ ఘటనలో మృతి చెందారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారని అధికారులు చెప్పారు.

ఈ ఘటనలో ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకొన్నారు. అమృత్‌సర్ లోని 144 బీఎస్ఎఫ్ బెటాలియన్ లో ఈ ఘటన జరిగిందని బీఎస్ఎఫ్ అధికారికంగా ప్రకటివంచింది.  సత్తెప్ప అనే బీఎస్ఎఫ్ జవాన్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సత్తెప్ప సహా ఐదుగురు మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని బీఎస్ఎఫ్ ప్రకటించింది.  గాయపడిన వారిని గురునానక్ ఆసుపత్రికి తరలించినట్టుగా అధికారులు తెలిపారు. తోటి జవాన్లపై కాల్పులు జరిపిన తర్వాత సత్తెప్ప కూడా ఆత్మహత్య చేసుకొన్నాడని  అధికారులు వివరించారు. ఈ ఘటనకు గల కారణాలపై బీఎస్ఎఫ్ విచారణకు ఆదేశించింది.


 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం