ఢిల్లీ లిక్కర్ స్కాం: ఈడీ విచారణకు కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు

Published : Mar 24, 2023, 01:21 PM ISTUpdated : Mar 24, 2023, 01:36 PM IST
ఢిల్లీ లిక్కర్ స్కాం: ఈడీ విచారణకు  కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు

సారాంశం

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఆడిటర్ బుచ్చిబాబును  ఈడీ అధికారులు ఇవాళ ప్రశ్నిస్తున్నారు. 

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  మాజీ  ఆడిటర్ బుచ్చిబాబును శుక్రవారంనాడు ఈడీ ప్రశ్నిస్తుంది.  బుచ్చిబాబును ఈడీ అరెస్ట్  చేసిన విషయం తెలిసిందే. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన  సీబీఐ అధికారులు  అరెస్ట్  చేశారు.  ఢిల్లీ లిక్కర్ పాలసీలో  బుచ్చిబాబు కీలకంగా  వ్యవహరించారని   సీబీఐ  ఆరోపించింది.  ఈ కేసులో  పలు దఫాలు  బుచ్చిబాబును సీబీఐ  అధికారులు  ప్రశ్నించారు.  బుచ్చిబాబుకు  చెందిన  గోరంట్ల అసోసియేట్స్  సంస్థలో  ఈడీ, సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.  ఈ సోదాల  సమయంలో  కీలక  సమాచారం  సేకరించారని  సమాచారం.ఈ సమాచారం ఆధారంగా  దర్యాప్తు  సంస్థలు విచారణ సాగించాయి.  

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఆడిటర్ బుచ్చిబాబును   విచారించేందుకు  ఈడీకి  కోర్టు  ఈ ఏడాది ఫిబ్రవరి  22న  అనుమతిని  ఇచ్చింది.  దీంతో  ఈడీ అధికారులు  బుచ్చిబాబును విడతల వారీగా  విచారిస్తున్నారు.  ఈ నెల  15వ తేదీన కూడా బుచ్చిబాబును  ఈడీ అధికారులు విచారించారు.  ఇవాళ కూడా  బుచ్చిబాబు ఈడీ విచారణకు  హాజరయ్యారు.  ఈ నెల  16న కవిత  ఈడీ విచారణకు  హాజరు కావాల్సి ఉంది. కానీ ఈ నెల  16న ఈడీ విచారణకు  కవిత విచారణకు  హాజరు కాలేదు.

also read:ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబుకు ఈడీ నోటీసులు..

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  సౌత్ గ్రూప్ కీలక పాత్ర పోషించిందని  దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈ కేసులో  భాగంగా  రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన  పలువురిని  దర్యాప్తు సంస్థలు  అరెస్ట్  చేశాయి. ఈ నెల  6వ తేదీన  అరుణ్ రామచంద్రపిళ్లైని  ఈడీ అధికారులు  అరెస్ట్  చేశారు.   అరుణ్ రామచంద్ర పిళ్లై  వాంగ్మూలం ఆధారంగా   బీఆర్ఎస్  ఎమ్మెల్సీ  కవితను  ఈడీ అధికారులు విచారణకు  రావాలని  నోటీసులు ఇచ్చారు. 

PREV
click me!

Recommended Stories

బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu