మృగాడు.. సొంత చెల్లిపై అన్న అఘాయిత్యం.. గర్భం దాల్చడంతో....

Published : Nov 29, 2021, 08:51 AM IST
మృగాడు.. సొంత చెల్లిపై అన్న అఘాయిత్యం.. గర్భం దాల్చడంతో....

సారాంశం

చిన్న వయసులోనే తల్లిదండ్రులు  మృతి చెందడంతో  పదహారేళ్ల ఓ బాలిక  అన్న విజయ్ కుమార్ వద్ద ఉంటుంది. ఈ బాలికకు ఇద్దరు అన్నలు, ఇద్దరు అక్కలు ఉన్నారు. అక్కలిద్దరికీ పెళ్లిళ్లు అయి వెళ్లిపోయారు. దీంతో తన అన్న దగ్గరే ఆమె ఉంటోంది.దీన్నే ఆసరాగా తీసుకున్నాడు ఆ మృగాడైన అన్న.. అత్యంత దారుణానికి ఒడిగట్టాడు..

మైసూర్ : తోబుట్టువుకు అమ్మా,నాన్న అన్నీ తానై తోడుగా ఉండి కాపాడాల్సిన అన్నే.. కీచకుడిగా మారాడు. తోడబుట్టిన చెల్లెపై పాశవికంగా  ఓ brother అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణంతో ఆమె preganant అయ్యింది. ఈ ఘటన మైసూరు  గిరి దర్శిని  నగరలు వెలుగు చూసింది. ఈ దారుణానికి కారకుడైనా కామాంధుడు వినయ్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. 

వివరాల్లోకి వెళితే.. చిన్న వయసులోనే తల్లిదండ్రులు  మృతి చెందడంతో  పదహారేళ్ల ఓ బాలిక  అన్న విజయ్ కుమార్ వద్ద ఉంటుంది. ఈ బాలికకు ఇద్దరు అన్నలు, ఇద్దరు అక్కలు ఉన్నారు. అక్కలిద్దరికీ marriages అయి వెళ్లిపోయారు. దీంతో తన అన్న దగ్గరే ఆమె ఉంటోంది.

అయితే, మద్యానికి బానిసైన  వినయ్ కుమార్.. తరచూ మద్యం తాగి వచ్చి చెల్లిపై  లైంగికదాడికి పాల్పడేవాడు. ఇలా ఒక్కసారి, రెండు సార్లు కాదు గత మూడు నెలలుగా 
Sexual assault జరుగుతూ ఉంది. ఈ విషయం ఎవరికి చెప్పుకోవాలో తెలీక, అన్న బెదిరింపులకు భయపడి బాలిక లోలోపలై కుంగిపోతోంది. కాగా, ప్రస్తుతం బాలిక గర్భవతి అయింది. ఇది తెలిసిన మరో అన్న షాక్ అయ్యాడు. విషయం గట్టిగా నిలదీయగా... ఏడుస్తూ అన్న చేస్తున్న అఘాయిత్యాన్ని బయటపెట్టింది. 

దీంతో ఆ అన్న ఆళనహళ్ళి policeలకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు. తల్లిదండ్రులు దూరమై, ఏ దిక్కూ లేక తన పంచన చేరిన చెల్లి నిస్సహాయతను ఆసరాగా తీసుకుని ఇంత దారుణానికి పాల్పడ్డ ఆ మృగాడైన అన్నను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బాలికను ఆసుపత్రిలో చేర్పించారు.

కాగా, శివమొగ్గలో ఇలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. ఓ బాలికకు గర్భం రావడంతో దానికి కారణమైన యువకుడిరి అరెస్ట్ చేశారు. minor girlను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, గర్భవతిని చేసిన కేసులో యువకుడిని అరెస్టు చేశారు పోలీసులు.  

భద్రావతిలోని న్యూటౌన్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం బాలికకు అనారోగ్యంగా ఉండటంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి బాలిక కడుపుతో ఉందని చెప్పారు. తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించగా విషయం బయటపెట్టింది. దీంతో సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి యువకుడిని అరెస్టు చేశారు. 

భర్త.. భార్యను కొట్టడం తప్పేం కాదు.. సర్వేలో షాకింగ్ నిజాలు.. తెలుగురాష్ట్రాలే టాప్...
  
ఇదిలా ఉండగా, కర్ణాటకలోని మైసూరు జిల్లాలో  వివాహేతర సంబంధం నెపంతో వివాహితతో పాటు ఓ యువకుడిని కరెంట్ స్థంబానికి కట్టి చితకబాదారు. మూడు రోజుల పాటు కనీసం అన్న పానీయాలు ఇవ్వకుండా వారిని తీవ్ర చిత్ర హింసలకు గురి చేసిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది.

Karnatakaలోని  nanjangud తాలుకాకు చెందిన  వివాహితకు కూలీ పనులకు వెళ్తున్న సమయంలో Vishnu అనే యువకుడితో Exrtra marital affair సంబంధం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయాన్ని వివాహిత భర్త గుర్తించాడు. వీరిద్దరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని భర్త భావించాడు.ఇందుకుగాను అదను కోసం ఎదుదు చూస్తున్నాడు. మూడు రోజుల క్రితం విష్ణు  వివాహిత ఇంటికి వచ్చాడు.  ఈ సమయం కోసం వివాహిత Husband ఎదురు చూస్తున్నాడు విష్ణు రాగానే బయటి నుండి ఇంటి తలుపులు మూసేశాడు.  ఇరుగు పొరుగు వారిని పిలిచాడు. స్థానికులంతా కలిసి విష్ణుతో పాటు వివాహితను బయటకు తీసుకొచ్చారు.

విద్యుత్ స్థంభానికి ఇద్దరిని కట్టేశారు. మూడు రోజుల పాటు  వీరిద్దరికి అన్న పానీయాలు ఇవ్వలేదు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి Social Mediaలో పోస్టు చేశారు. దీంతో పోలీసుల దృష్టికి వచ్చింది. Police వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను విడిపించారు.  ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు ఈ కేసులో వివాహిత భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహిత మరిదితో పాటు కొందరు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu