యువకులతో చనువుగా ఉంటోందని... అక్క పీక పిసికిన తమ్ముడు

Published : Aug 28, 2018, 04:28 PM ISTUpdated : Sep 09, 2018, 12:12 PM IST
యువకులతో చనువుగా ఉంటోందని... అక్క పీక పిసికిన తమ్ముడు

సారాంశం

యువకులతో చనువుగా ఉంటోందని సొంత అక్కను హత్య చేశాడు తమ్ముడు. మహారాష్ట్రలోని వాలివ్ పట్ణణానికి చెందిన ఓ యువతి స్థానిక యువకులతో చనువుగా ఉంటోంది. 

యువకులతో చనువుగా ఉంటోందని సొంత అక్కను హత్య చేశాడు తమ్ముడు. మహారాష్ట్రలోని వాలివ్ పట్ణణానికి చెందిన ఓ యువతి స్థానిక యువకులతో చనువుగా ఉంటోంది. దీనిని గ్రహించిన ఆమె తమ్ముడు ప్రవర్తన మార్చుకోవాల్సిందిగా అక్కను హెచ్చరించాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్యా వాగ్వివాదం చోటు చేసుకోవడం ఆమెపై చేయి కూడా చేసుకున్నాడు.

అయినప్పటికీ అక్క ప్రవర్తన మార్చుకోకపోవడంతో చివరకు ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో అమ్మానాన్నలు పనికి వెళ్లిన సమయంలో చున్నీని ఆమె గొంతుకు బిగించి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే అతను మైనర్ కావడంతో బాలుర సంరక్షణ కేంద్రానికి తరలించారు. యువతి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

PREV
click me!

Recommended Stories

వందేమాతర గేయాన్ని సోనియా గాంధీ అడ్డుకున్నారా.? పంద్రాగ‌స్టు రోజు అస‌లేం జ‌రిగింది.?
అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial