ప్రియురాలిపై సామూహిక అత్యాచారయత్నం.. స్థానికుల దేహశుద్ధి

Published : Jan 30, 2020, 11:27 AM IST
ప్రియురాలిపై సామూహిక అత్యాచారయత్నం.. స్థానికుల దేహశుద్ధి

సారాంశం

నలుగురు కలిసి యువతిపై లైంగిక దాడికి పాల్పడాలని ప్రయత్నించారు. దీంతో... తనకున్న ప్రమాదాన్ని పసిగట్టిన యువతి అక్కడి నుంచి పరుగులు తీసింది. ఆ నలుగురు యువతిని పట్టుకునేందుకు పరుగులు తీశారు. ఆ సమయంలో అడవిలో కట్టెలు కొట్టేందుకు  అక్కడికి వచ్చిన కొందరు వాళ్లను చూశారు.


ప్రేమ పేరిట యువతికి దగ్గరయ్యాడు. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను అని చెప్పగానే ఆమె నిజమని నమ్మింది. ఆ యువకుడి ప్రేమను అంగీకరించింది. అయితే... అతను మాత్రం ఆమెను మోసం చేయాలని చూశాడు. తన స్నేహితులతో కలిసి ఆమెను చెరపట్టాలని చూశాడు. కానీ అతని దుర్మార్గానికి స్థానికులు చెక్ పెట్టారు. యువకుడిని చితకబాది యువతిని రక్షించారు. ఈ సంఘటన తమిళనాడు  రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... రాణిపేట జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని(19) వేలూరులో ఉన్న ఒక కళాశాలలో చదువుతోంది. అదే కళాశాలలో చదువుతున్న వేలూరు వేలపాడికి చెందిన  ఓ యువకుడు ఆమెకు ప్రేమ పేరిట దగ్గరయ్యాడు.  ఈ నెల 24న ఇద్దరూ కలిసి వేలూరు సమీపంలోని అమిర్థి పార్కుకు వెళ్లారు. అనంతరం పార్కు నుంచి సుమారు 6 కిలో మీటర్ల దూరంలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన ప్రియుడు తన ముగ్గురు స్నేహితులను అక్కడికి రప్పించాడు.

నలుగురు కలిసి యువతిపై లైంగిక దాడికి పాల్పడాలని ప్రయత్నించారు. దీంతో... తనకున్న ప్రమాదాన్ని పసిగట్టిన యువతి అక్కడి నుంచి పరుగులు తీసింది. ఆ నలుగురు యువతిని పట్టుకునేందుకు పరుగులు తీశారు. ఆ సమయంలో అడవిలో కట్టెలు కొట్టేందుకు  అక్కడికి వచ్చిన కొందరు వాళ్లను చూశారు.

Also Read టీవీ సీరియల్ చూసి కిడ్నాప్ చేశాడు.. కానీ..

అప్పటికే యువతి దుస్తులు చినిగిపోయాయి. వెంటనే పరిస్థితిని గమనించిన స్థానికులు యువతిని రక్షించారు. ఆమె ప్రేమికుడిని పట్టుకొని చితకబాదారు. దీంతో.. అతని స్నేహితులు అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం యువతి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆమెను వారికి అప్పగించారు. పరువుపోతుందని యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. విషయం పోలీసులకు తెలియడంతో విచారణ చేస్తున్నారు. అమిర్థి అటవీ ప్రాంతానికి జంటలు వెళ్లరాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

చెన్నై లో నూతన భవనాలను ప్రారంభించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Visits Perambur
అధికారులను పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్ | CM Joseph Vijay Distributes Ration to Families