కరోనా స్ట్రెయిన్ ఎఫెక్ట్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇండియా టూర్ రద్దు

Published : Jan 05, 2021, 06:02 PM IST
కరోనా స్ట్రెయిన్ ఎఫెక్ట్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇండియా టూర్ రద్దు

సారాంశం

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇండియా పర్యటన రద్దైంది. కరోనా కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ నేపథ్యంలో యూకేలో మరోసారి లాక్ డౌన్ విధించింది అక్కడి ప్రభుత్వం.  

న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇండియా పర్యటన రద్దైంది. కరోనా కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ నేపథ్యంలో యూకేలో మరోసారి లాక్ డౌన్ విధించింది అక్కడి ప్రభుత్వం.

ఈ ఏడాదిలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు జాన్సన్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. ఈ ఆహ్వానానికి గత నెలలోనే అంగీకరించారు.

ఈ నెల చివర్లో తాను భారత్ ను సందర్శించలేనని  భారత ప్రధానితో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్  మాట్లాడినట్టుగా బ్రిటిష్ వార్తా సంస్థ తెలిపింది.ఈ విషయమై మోడీతో మంగళవారం నాడు ఉదయం ఫోన్ లో మాట్లాడారని ఆ వార్తా సంస్థ ప్రకటించింది.

ఇంగ్లాండ్ లో ఫిబ్రవరి వరకు లాక్ డౌన్ విధిస్తూ బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే.

కరోనా కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ బ్రిటన్ లో గుర్తించారు. బ్రిటన్ నుండి ఇతర దేశాలకు ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందింది. దీంతో ఇప్పటికే బ్రిటన్ చాలా దేశాలు విమానాలను నిషేధించాయి. కరోనా కేసులు పెరిగిపోవడంతో మరోసారి లాక్ డౌన్ విధిస్తూ బ్రిటన్ సర్కార్ నిర్ణయం తీసుకొంది.
 

PREV
click me!

Recommended Stories

Love Jihad in Nashik TCS | హిందూ అమ్మాయిలే టార్గెట్ 🎯 ఎలా ట్రాప్ చేస్తారంటే..| Asianet News Telugu
Viral News: శోభ‌నం గ‌దిలో పెళ్లి కూతురు షాకింగ్ కండిష‌న్‌.. దెబ్బ‌కు పెళ్లి కొడుకు ఫ్యూజుల‌వుట్