అర్నాబ్ గోస్వామి కేసు: బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

By Siva KodatiFirst Published Nov 7, 2020, 9:16 PM IST
Highlights

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి బెయిల్ పిటిషన్‌పై శనివారం బొంబాయి హైకోర్టులో విచారణ జరిగింది. 6 గంటలు విచారణ తరువాత, బెయిల్ నిర్ణయాన్ని న్యాయస్థానం రిజర్వు చేసింది. 

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి బెయిల్ పిటిషన్‌పై శనివారం బొంబాయి హైకోర్టులో విచారణ జరిగింది. 6 గంటలు విచారణ తరువాత, బెయిల్ నిర్ణయాన్ని న్యాయస్థానం రిజర్వు చేసింది. దీని కారణంగా అర్నాబ్ ఇంకా జైలులోనే ఉండాల్సి ఉంటుంది.

ప్రస్తుతానికి, కోర్టు అర్నాబ్‌కు ఉపశమనం ఇచ్చింది. ఆయన కోరుకుంటే, దిగువ కోర్టులో పిటిషన్ దాఖలు చేయవచ్చు. ఇందుకు సంబంధించి హైకోర్టు దిగువ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. అర్నాబ్ తరపున పిటిషన్ దాఖలు చేస్తే, 4 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

అంతకుముందు అర్నాబ్.. పోలీసులు తనను షూతో కొట్టారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కనీసం తాను నీళ్ళు కూడా తాగలేదు. విచారణ సందర్భంగా అర్నాబ్ న్యాయవాది కోర్టులో అనుబంధ పిటిషన్‌ను దరఖాస్తు చేసుకున్నారు.

ఇది కాకుండా, తన చేతిలో 6 అంగుళాల లోతైన గాయం, వెన్నుపాము మరియు నరాల గాయం ఉన్నట్లు కూడా అర్నాబ్ పేర్కొన్నారు. అరెస్టు చేసేటప్పుడు పోలీసులు తనకి బూట్లు ధరించడానికి కూడా సమయం ఇవ్వలేదని అర్నాబ్ చెప్పారు.

ఇంటీరియర్ డిజైనర్ అన్వాయ్, అతని తల్లి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపణలతో అర్నాబ్‌ను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు రెండేళ్ల క్రితం మూసివేయబడింది.

మరోవైపు అర్నాబ్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే, బెయిల్ పిటిషన్‌పై కోర్టు తీర్పుకు ముందు అతన్ని జైలుకు పంపలేదు. ఆయన 3 రోజులుగా అలీబాగ్‌లోని ఒక పాఠశాలలోని కోవిడ్ సెంటర్‌లో ఉన్నారు. 

మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జైళ్ల శాఖ అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 23 నగరాల్లో 30కి పైగా తాత్కాలిక జైళ్లను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలలు, హాస్టళ్లు, కాలేజీలను ఇందుకోసం ఉపయోగిస్తున్నారు.

14 రోజుల పాటు క్వారంటైన్‌‌లో ఉంచిన అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత సాధారణ జైళ్లకు తరలిస్తున్నారు. ఈ తాత్కాలిక జైళ్ల వద్ద పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

2018 నాటి ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్‌ ఆత్మహత్య కేసులో అర్నాబ్ గోస్వామిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. రిపబ్లిక్ టీవీ బకాయిలు చెల్లించలేదన్న కారణంగా అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారంటూ అర్నాబ్ సహా మరో ఇద్దరిపై ఐపీసీ సెక్షన్ 304 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), సెక్షన్ 34 (ఒకే ఉద్దేశంతో నిందితులు ఏకంకావడం) తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

 

click me!