హైదరాబాద్- కోల్ కతా ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో... అధికారులు వెంటనే విమానాన్ని చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
హైదరాబాద్- కోల్ కతా ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో... అధికారులు వెంటనే విమానాన్ని చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అనంతరం విమానంలో నుంచి ప్రయాణికులను కిందకు దించేసి సోదాలు చేపట్టారు. కాగా... విమానంలో ఎలాంటి బాంబు లేదని తేలింది.
కాగా.... అధికారులకు ఫేక్ కాల్ చేసిన వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు. తాగిన మైకంలో అతను బాంబు ఉందని బెదిరించినట్లు పోలీసులు గుర్తించారు. కాగా... ప్రయాణికులను తిరిగి అదే విమానంలో గమ్యస్థానానికి చేర్చనున్నట్లు అధికారులు చెప్పారు.