కేరళ కన్నూరులోని ఆర్‌ఎస్ఎస్ కార్యాలయంపై బాంబు దాడి..

Published : Jul 12, 2022, 11:37 AM IST
కేరళ కన్నూరులోని ఆర్‌ఎస్ఎస్ కార్యాలయంపై బాంబు దాడి..

సారాంశం

కేరళలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్‌ఎస్) కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. కన్నూర్‌ జిల్లాలోని పయ్యన్నూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంపై మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. 

కేరళలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్‌ఎస్) కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. కన్నూర్‌ జిల్లాలోని పయ్యన్నూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంపై మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో ఆర్ఎస్‌ఎస్ కార్యాలయం కిటికీ అద్దాలు పగిలిపోయాయి. ఈ బాంబు దాడిలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. 

అదే సమయంలో ఈ దాడికి కారణమైన నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. అలాగే నగరంలోని ప్రైవేటు సంస్థల నుంచి సీసీటీవీ ఫుటేజ్‌లను కూడా సేకరిస్తున్నారు. అయితే కొందరు బైక్‌లపై వచ్చి ఈ దాడికి పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

మరోవైపు ఈ దాడికి నిరసనగా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు పయ్యన్నూరు పట్టణంలో ఉదయం పాదయాత్ర చేపట్టారు. దాడి వెనుక సీపీ(ఎం) హస్తం ఉందని స్థానిక ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ నేతలు ఆరోపించారు.

PREV
click me!

Recommended Stories

యువతకు AI శిక్షణ ఇచ్చేందుకు సరికొత్త పథకం... ఏదో తెలుసా?
Best Honeymoon Spots : ఖర్చు తక్కువ, కిక్ ఎక్కువ.. ఇండియాలో బడ్జెట్ ప్రెండ్లీ హనీమూన్ స్పాట్స్ ఇవే