Jhansi dam: ఉత్తప్రదేశ్ లోని ఒక డ్యామ్ లో లభించిన ముగ్గురు మహిళల మృతదేహాలు మధ్యప్రదేశ్లోని తికమ్గఢ్ జిల్లా నుంచి వచ్చి ఉండవచ్చని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. బాధితులను గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లోని ఒక డ్యామ్ లో ముగ్గురు మహిళల మృతదేహాలు కనిపంచడం స్థానికంగా కలకలం రేపింది. అయితే, ఈ మృతదేహాలు వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి వుంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితులను గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు. వివరాల్లోకెళ్తే.. శనివారం సాయంత్రం ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలోని మౌరానీపూర్ ప్రాంతంలో ఉన్న డ్యామ్లో ముగ్గురు మహిళల మృతదేహాలు బయటకు వచ్చాయని పోలీసులు తెలిపారు. మృతదేహాలు మధ్యప్రదేశ్లోని తికమ్గఢ్ జిల్లా నుంచి వచ్చి ఉండవచ్చని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. బాధితులను గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
Bodies of three women between 19-25 washed up on a dam in UP's Jhansi district was recovered by the local police. Their identity and cause of death is yet to be ascertained. pic.twitter.com/CI82GyEMJG
— Piyush Rai (@Benarasiyaa)సప్రార్ డ్యాంలో తేలియాడుతున్న మృతదేహాల గురించి సమాచారం మౌరానీపూర్కు చెందిన నీటిపారుదల శాఖ ఉద్యోగి నుండి అందిందని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజేష్ ఎస్ తెలిపారు. మృతదేహాలను బయటకు తీశారని చెప్పారు. మొదట కనిపించిన మృతదేహం దాదాపు 25 ఏళ్ల మహిళగా కనిపిస్తోందని ఆయన చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికి మరో రెండు మృతదేహాలు కనిపించాయి. బాధితులు 18 నుంచి 20 ఏళ్ల మధ్య వయస్సు గల వారని తెలిపారు. అయితే, మృతదేహాలపై ఎలాంటి గాయాలు కనిపించడం లేదని పోలీసు అధికారులు తెలిపారు. వారు తికమ్ఘర్ జిల్లా నుండి కొట్టుకుపోయి వచ్చిఉండవచ్చునని అన్నారు. మృతదేహాలను పోస్ట్మార్టం పరీక్ష కోసం పంపినట్లు ఎస్ఎస్పీ తెలిపారు. మృతులను త్వరలోనే గుర్తిస్తామనీ, పోస్టుమార్టం తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఒకే సారి ముగ్గురు మహిళల మృత దేహాలు లభ్యంకావడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
"यूपी के झांसी जिले में तीन अज्ञात युवती का मिला शव"
Dead bodies of three unidentified girls have been found in Saparar (Kuraicha) dam located in district of . All three are between 19 and 25 years old. pic.twitter.com/poC3wbA0sc
ఇదిలావుండగా, బుధవారం ఉత్తప్రదేశ్ లోని భోగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో 19 ఏళ్ల బీఎస్సీ విద్యార్థినిని తన ఇంట్లోనే అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగినప్పుడు విద్యార్థిని ఇంట్లో ఒంటరిగా ఉందనీ, ఆమె చెల్లెలు పాఠశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాతే ఈ విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఆమె చెల్లెలు ఇంటికి తిరిగివచ్చి తలుపు తట్టడంతో నిందితుడు ఇంటి నుంచి బయలకు పరుగెత్తి పారిపోయాడు. తన కుమార్తెపై అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపిస్తూ మహిళ తండ్రి నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ కమలేష్ దీక్షిత్ తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం పంపించామనీ, నిందితుడి ఇంటిపై, అతని రహస్య స్థావరాలపై పోలీసు బృందాలు దాడి చేశాయనీ, త్వరలో అరెస్టు చేస్తామని చెప్పారు.