హౌరాలో హింసాకాండ వెనుక బీజేపీ హస్తం - పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు

Published : Mar 31, 2023, 04:02 PM IST
హౌరాలో హింసాకాండ వెనుక బీజేపీ హస్తం - పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు

సారాంశం

శ్రీ రామనవమి వేడుకల సందర్భంగా పశ్చిమ బెంగాల్ లోని హౌరాలో చోటు చేసుకున్న ఘర్షణల వెనుక బీజేపీ, ఇతర మితవాద సంస్థల హస్తం ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ ఘటనకు కారణమైన 31 మందిని అరెస్టు చేశామని, శాంతి భద్రతలను కాపాడాలని ఆమె ప్రజలను కోరారు. 

పశ్చిమ బెంగాల్ లోని హౌరాలో నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకల్లో మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వాహనాలను తగులబెట్టారు. దుకాణాలను ధ్వంసం చేశారు. అయితే ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. హౌరాలో చోటు చేసుకున్న హింసాకాండకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ఇతర మితవాద సంస్థలే కారణమని ఆమె అన్నారు. ఈ అల్లర్లలో ఆస్తులు కోల్పోయిన ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని, ఈ ప్రాంతంలో శాంతిని కాపాడాలని మమతా బెనర్జీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

బైక్‌ను కిలోమీటరు ఈడ్చుకెళ్లిన ట్రక్.. వ్యక్తి దుర్మరణం.. భార్య, కొడుకుకు స్వల్ప గాయాలు

‘‘హౌరా ఘటన చాలా దురదృష్టకరం. హౌరాలో జరిగిన హింసాకాండ వెనుక హిందువులు, ముస్లింలు లేరు. బీజేపీతో పాటు భజరంగ్ దళ్, ఇతర సంస్థలు ఆయుధాలతో హింసకు పాల్పడుతున్నాయి’’ అని మమతా బెనర్జీ ‘ఏబీపీ ఆనంద’తో అన్నారు. హౌరాలో జరిగిన హింసాత్మక ఘర్షణలకు సంబంధించి దాదాపు 31 మందిని అరెస్టు చేసినట్లు మమతా బెనర్జీ తెలిపారు. ఈ ఘటనలకు అడ్మినిస్ట్రేటివ్ లోని ఓ విభాగం అలసత్వమే కారణమని ఆమె ఆరోపించారు. మమతా బెనర్జీ ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, బీజేపీ నేత సువేందు అధికారి స్పందించారు. హింసాకాండకు ముఖ్యమంత్రి, రాష్ట్ర అధికార యంత్రాంగం బాధ్యత వహించాలని అధికారి అన్నారు.

కాగా.. శ్రీరామనవమి రోజున మహారాష్ట్ర, గుజరాత్ లోని కొన్ని ప్రాంతాల్లో కూడా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో నమాజ్ జరుగుతున్నప్పుడు మసీదు వెలుపల మ్యూజిక్ సిస్టంలో పాటలు పెట్టడంతో ఇక్కడ ఘర్షణ నెలకొంది. ఇది తీవ్ర విధ్వంసానికి దారి తీసింది. ఈ ఘటనలో ప్రమేయం ఉందని భావిస్తున్న 56 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దేశ‌రాజ‌ధానిలో భారీ వ‌ర్షం.. ఈశాన్య ప్రాంతాలకు ఐఎండీ హెచ్చరికలు

అదేవిధంగా గుజరాత్ లోని వడోదరలో గురువారం శ్రీరామనవమి సందర్భంగా ఫతేపురా ప్రాంతంలో జరిగిన ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల ప్రజలు రాళ్లు రువ్వుకున్నారు. వాహనాలు కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి 22 మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతం ప్రశాంతంగా ఉందని పోలీసులు తెలిపారు. గతంలో వడోదరలోని కుంభర్వాడ ప్రాంతంలో ఊరేగింపు సందర్భంగా కూడా ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి.

రేపు జైలు నుంచి విడుదల కానున్న పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ..

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లోని రామాలయం వద్ద రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. దీనిని అదుపు చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో 500 మంది ఉన్న గుంపు పోలీసులపై రాళ్లు, పెట్రోల్ నింపిన బాటిళ్లను విసిరారు. దీంతో 12 మంది గాయపడ్డారు. ఇందులో 10 మంది పోలీసులు ఉన్నారు. నగరంలోని ప్రసిద్ధ రామాలయం ఉన్న నగరంలోని కిరాద్ పురా ప్రాంతంలో బుధ, గురువారాల్లో అర్ధరాత్రి దుండగులు 13 వాహనాలను తగలబెట్టారు. అల్లరి మూకలను అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించి కొన్ని ప్లాస్టిక్ బుల్లెట్లు, లైవ్ రౌండ్లు ప్రయోగించాల్సి వచ్చింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది.

PREV
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్